News December 8, 2024
2047 నాటికి 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్: ప్రధాన్

దేశ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. జంషెడ్పూర్ XLRI మేనేజ్మెంట్ స్కూల్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. $3 ట్రిలియన్ల పరిమాణంతో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందన్నారు. మరో 3 ఏళ్లలో $5 ట్రిలియన్లతో 3వ స్థానానికి చేరుతుందని, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా నిలుస్తుందన్నారు.
Similar News
News November 21, 2025
గిల్కు నేడు ఫిట్నెస్ టెస్ట్

సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ గిల్ ఫిట్నెస్ టెస్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టీమ్తోపాటు గువాహటి వెళ్లిన గిల్.. నిన్న ప్రాక్టీస్కు హాజరుకాలేదు. అతడు మ్యాచ్ ఆడే ఛాన్స్లు తక్కువేనని సమాచారం. గిల్ కోలుకుంటున్నారని, ఇవాళ సాయంత్రం ఫిజియోలు, డాక్టర్లు తుది నిర్ణయం తీసుకుంటారని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. తొలి టెస్టులో మెడ నొప్పితో గిల్ మైదానాన్ని వీడటం తెలిసిందే.
News November 21, 2025
గుమ్మానికి నిమ్మ, మిరపకాయ ఎందుకు కడతారు?

ఇళ్లు, షాప్ గుమ్మాలకు, వాహనాలకు నిమ్మ, మిరపకాయలు కడుతుంటారు. ఇది చెడు దృష్టిని తొలగిస్తుందని నమ్మకం. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్థాల వాడకం పెంచేందుకే పూర్వీకులు ఈ పద్ధతిని ప్రోత్సహించారని అంటారు. ఇలా కడితే ఇంటి చుట్టూ ఉండే వాతావరణం శుభ్రమవుతుంది. వాహనాలకు వీటిని తగిలించడం వలన వీటిలోని సానుకూల శక్తి చుట్టూ ఉండే చెడు దృష్టిని తొలగించి, ప్రమాదాలు జరగకుండా కాపాడుతుందని విశ్వాసం.
News November 21, 2025
ఓట్ల సవరణ ఆపండి.. ECకి మమతా బెనర్జీ లేఖ

రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)ను నిలిపివేయాలని CEC జ్ఞానేశ్ కుమార్కు బెంగాల్ CM మమతా బెనర్జీ లేఖ రాశారు. ‘BLOలు పరిమితి దాటి పని చేస్తున్నారు. EC తీరు ఆమోదయోగ్యంగా లేదు. వారికి సపోర్టుగా నిలిచేది పోయి బెదిరింపులకు పాల్పడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న SIRను ఆపాలని కోరుతున్నా. వారికి సరైన ట్రైనింగ్ ఇవ్వండి. ప్లానింగ్ లేకుండా చేస్తున్న ఈ ప్రక్రియ ప్రమాదకరం’ అని పేర్కొన్నారు.


