News December 8, 2024
2047 నాటికి 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్: ప్రధాన్
దేశ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. జంషెడ్పూర్ XLRI మేనేజ్మెంట్ స్కూల్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. $3 ట్రిలియన్ల పరిమాణంతో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందన్నారు. మరో 3 ఏళ్లలో $5 ట్రిలియన్లతో 3వ స్థానానికి చేరుతుందని, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా నిలుస్తుందన్నారు.
Similar News
News January 20, 2025
నూతన అధ్యక్షుడు తొలుత చేసే సంతకాలు ఇవే…!
అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ ఎన్నికల హామీలపై ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. మెక్సికోతో ఉన్న సరిహద్దును మూసివేయడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపడం, ఆర్మీలో ట్రాన్స్జెండర్ల నియామకానికి అడ్డుకట్ట వేయడంతో పాటు పలు కీలక ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.
News January 20, 2025
J&K ఎన్కౌంటర్: భారత జవాన్ వీరమరణం
J&Kలో జరిగిన ఎన్కౌంటర్లో భారత ఆర్మీ జవాన్ పంగల కార్తీక్ వీరమరణం పొందారు. నార్త్ కశ్మీర్లోని జలూరా సోపోరాలో ఇవాళ ఇస్లామిస్ట్ తీవ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో కార్తీక్ తీవ్రగాయాలపాలవడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరికొందరు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.
News January 20, 2025
ట్రంప్ మంచి మాట చెప్పావ్: పుతిన్
మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిలువరిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతిచ్చారు. ‘ట్రంప్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నా. రష్యాతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటానని ట్రంప్ చెప్పడం మంచిదే. అమెరికా కొత్త పాలకవర్గంతో చర్చలు జరుపుతాం’ అని పుతిన్ వ్యాఖ్యానించారు. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పశ్చిమాసియాలో యుద్ధాలను ఆపుతానని ట్రంప్ నిన్న చెప్పారు.