News November 30, 2024
పాకిస్థాన్ చేతిలో భారత్ U19 జట్టు ఓటమి

U19 ఆసియాకప్లో భాగంగా పాకిస్థాన్తో వన్డే మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు ఓటమిపాలైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 రన్స్ చేసింది. 282 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత జట్టు 47.1 ఓవర్లలో 237 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ జట్టులో షాజైబ్ ఖాన్(159) సెంచరీతో రాణించారు. భారత జట్టులో నిఖిల్ కుమార్(67) ఫర్వాలేదనిపించినా మిగిలిన వారంతా విఫలమయ్యారు.
Similar News
News January 21, 2026
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. మళ్లీ పడతాయా?

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్గా మొదలయ్యాయి. నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 25,185 వద్ద, సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 82,025 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్లో ICICI బ్యాంక్, BE, ట్రెంట్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాలో ట్రేడవుతున్నాయి. నిన్న ₹9 లక్షల కోట్లకు పైగా మార్కెట్లు <<18907026>>నష్టపోవడం<<>> తెలిసిందే.
News January 21, 2026
ఆ ఉద్యోగుల శాలరీలు నేరుగా ఖాతాల్లోకి!

TG: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో IFMIS విధానంలో నేరుగా ఖాతాల్లోకి జీతాలు చెల్లించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో హెచ్వోడీ, ఏజెన్సీల అకౌంట్లు వంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఇది April నుంచి అమలయ్యేలా ఉద్యోగుల వివరాలను డిజిటలైజేషన్ చేస్తోంది. కాగా రాష్ట్రంలో దాదాపు 5 లక్షల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.
News January 21, 2026
SHOCKING: ఒకే రోజు రూ.5వేలు పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.5,020 పెరిగి రూ.1,54,800కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.4,600 ఎగబాకి రూ.1,41,900 పలుకుతోంది. అటు సిల్వర్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి ధర రూ.3,40,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.


