News August 18, 2024
గుండెపోటుతో ఇండియన్ కోస్టల్ గార్డ్ డీజీ మృతి

ఇండియన్ కోస్టల్ గార్డ్ డీజీ రాకేశ్ పాల్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. చెన్నైలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనకు స్ట్రోక్ వచ్చింది. వెంటనే అధికారులు ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మృతిపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. పాల్ నిబద్ధత గల అధికారి అని పేర్కొన్నారు.
Similar News
News July 10, 2025
ఈనెల 25న మరోసారి క్యాబినెట్ భేటీ

TG: ఇవాళ్టితో కలిపి INC ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 19సార్లు క్యాబినెట్ సమావేశాలు నిర్వహించి 327అంశాలపై చర్చించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటివరకు ఆమోదించిన అంశాల అమలుపై ఇవాళ సమీక్షించినట్లు చెప్పారు. నెలకు 2సార్లు క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించిన మేరకు ఈనెల 25న మరోసారి సమావేశం అవుతామన్నారు. అమిటీ, సెంటినరీ రీహాబిటేషన్ విద్యాసంస్థలను వర్సిటీలుగా మార్చాలని నిర్ణయించామన్నారు.
News July 10, 2025
ఇంగ్లండ్ నాలుగు వికెట్లు డౌన్

లార్డ్స్లో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే పోప్ను జడేజా ఔట్ చేశారు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ను బుమ్రా బౌల్డ్ చేశారు. ప్రస్తుతం క్రీజులో రూట్(62*), కెప్టెన్ స్టోక్స్(0*) ఉన్నారు. ఇంగ్లండ్ స్కోర్ 172/4గా ఉంది.
News July 10, 2025
PHOTOS: ‘బాహుబలి’ టీమ్ రీయూనియన్

ఇండియన్ మూవీని గ్లోబల్ రేంజ్కు తీసుకెళ్లిన ‘బాహుబలి’ మూవీ విడుదలై ఇవాళ పదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా రీయూనియన్ అయ్యారు. డైరెక్టర్ రాజమౌళి, నటులు ప్రభాస్, రానా, రమ్యకృష్ణ తదితరులు ఒక్కచోట చేరి తమ జర్నీని గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.