News May 11, 2024
పవన్ కళ్యాణ్కు భారత క్రికెటర్ మద్దతు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు భారత క్రికెటర్ హనుమా విహారి మద్దతు ప్రకటించారు. ‘ధర్మం గెలవాలి.. చరిత్రలో ఎప్పుడూ లేని మెజారిటీతో గెలిపించండి’ అని పిఠాపురం ప్రజలను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. విహారి నిన్న కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పవన్కు మద్దతుగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. మరోవైపు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు పిఠాపురం వెళ్లారు.
Similar News
News February 20, 2025
PHOTOS: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

AP: శ్రీశైలంలో యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేదపండితులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోనికి స్వామివార్ల యాగప్రవేశం చేశారు. ప్రత్యేక పూజలు, ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించి సకల దేవతలకు ఆహ్వానం పలికారు. మార్చి 1 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.
News February 20, 2025
ఫాస్టాగ్ 70 నిమిషాల రూల్పై NHAI క్లారిటీ

టోలోప్లాజాకు చేరుకునే ముందు 60 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు ఫాస్టాగ్ ఇన్యాక్టివ్లో ఉంటే డబుల్ టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. FEB 17 నుంచి అమల్లోకి వచ్చిన తాజా నిబంధనలతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. దీనిపై NHAI క్లారిటీ ఇచ్చింది. ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్, టోల్ పేమెంట్ అందుకున్న బ్యాంక్ మధ్య వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి NPCI ఈ సర్క్యూలర్ జారీ చేసిందని వెల్లడించింది.
News February 20, 2025
BREAKING: జగన్పై కేసు నమోదు

AP: మాజీ సీఎం జగన్పై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డు కార్యక్రమం నిర్వహించినందుకు నల్లపాడు పోలీసులు చర్యలు తీసుకున్నారు. జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సహా 8 మందిపై కేసు పెట్టారు.