News November 19, 2024

BGT కోసం భారత క్రికెటర్ల ప్రాక్టీస్

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జైస్వాల్, రిషభ్ పంత్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. ఆయన హోటల్ రూమ్‌లోనే ఉండిపోయారు. కాగా ఈ నెల 22 నుంచి INDvsAUS మధ్య పెర్త్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Similar News

News March 9, 2026

OFFICIAL: ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తాబా

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు <<19299249>>మొజ్తాబా<<>> ఖమేనీ ఎన్నికైనట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. 88 మందితో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ బాడీ ఆయన్ను ఎన్నుకుంది. ఇరానియన్లు ఐక్యతను కాపాడుకోవాలని, మొజ్తాబా ఖమేనీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చింది. నిర్ణయాత్మక ఓటు ద్వారా ఆయన ఎన్నికైనట్లు సమాచారం. ప్రస్తుతం మొజ్తాబా వయసు 56 ఏళ్లు.

News March 9, 2026

యూట్యూబ్‌లోనే వీడియోలు, మెసేజ్‌లు పంపుకోవచ్చు!

image

యూట్యూబ్‌లో డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్ మళ్లీ రాబోతోంది. యాప్‌లోనే వీడియోలు, మెసేజ్‌లు పంపుకునేలా వెసులుబాటు కల్పించే ఈ ఫీచర్‌ను 2019లో కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు కొత్త వెర్షన్‌తో తీసుకురానుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇతర యాప్‌లు అవసరం లేకుండానే యూట్యూబ్‌లోనే వీడియోలు, మెసేజ్‌లు పంపుకోవచ్చు. దీనితో పాటు షార్ట్స్ కోసం AI రీమిక్స్ ఫీచర్ కూడా రానుంది.

News March 9, 2026

భారత్ డామినేషన్.. 3 ఏళ్లలో 6 WCలు

image

గత 3 ఏళ్లలో భారత్ 6 క్రికెట్ వరల్డ్ కప్‌లు గెలిచింది. 2024 మెన్స్ టీ20 WC, 2025 ఉమెన్స్ U19 WC, 2025 ఉమెన్స్ ODI WC, 2025 బ్లైండ్ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్, 2026 మెన్స్ అండర్-19 WCతో పాటు తాజాగా మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని Xలో పోస్ట్ చేశారు. అన్ని జట్లను అభినందించారు. ఇది ఇండియన్ క్రికెట్‌కు గోల్డెన్ ఎరా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.