News December 31, 2024
2024లో అత్యధిక రన్స్ చేసిన భారత క్రికెటర్లు (అన్ని ఫార్మాట్లు కలిపి)
*యశస్వీ జైస్వాల్- 1771 రన్స్ (37 ఇన్నింగ్సులు)
*శుభ్మన్ గిల్- 1189 (33)
*రోహిత్ శర్మ- 1154 (40)
*రిషభ్ పంత్- 804 (28)
*విరాట్ కోహ్లీ- 655 (32)
*రవీంద్ర జడేజా- 562 (23)
Similar News
News January 18, 2025
ODI WC23-CT25 మధ్య జట్టులో మార్పులివే
2023 వన్డే వరల్డ్ కప్కు ఎంపికైన 15 మంది ఆటగాళ్లలో 10 మంది 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోనూ చోటు దక్కించుకున్నారు. సూర్య, ఇషాన్, శార్దుల్, సిరాజ్, అశ్విన్ స్థానాల్లో జైస్వాల్, పంత్, సుందర్, అర్ష్దీప్, అక్షర్ ఎంట్రీ ఇచ్చారు. వీరంతా కూడా జాతీయ జట్టులో ఆడినవారే. ఈసారి కొత్త ముఖాలకు చోటు కల్పించలేదు. ఈ టీమ్ కూర్పు సరిగా లేదని కొందరు విమర్శిస్తుండగా, బాగానే ఉందని పలువురు అంటున్నారు. మీరేమంటారు?
News January 18, 2025
స్టార్ హీరోపై కత్తి దాడి.. అరెస్టైన నిందితుడు ఇతడే!
సైఫ్ అలీఖాన్పై దాడి నిందితుడిని ఛత్తీస్గఢ్లో రైల్వే పోలీసులు <<15190207>>అరెస్ట్<<>> చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడి ఫొటో వెలుగులోకి వచ్చింది. అతడిని పట్టుకున్నట్లు RPF పోలీసులు ముంబై క్రైమ్ బ్రాంచ్కి సమాచారం ఇచ్చారు. అతడి పేరు ఆకాశ్ కనోజియాగా గుర్తించారు. దీంతో ముంబై అధికారులు వీడియో కాల్ చేసి నిందితుడిని చూశారు. అనంతరం ఛత్తీస్గఢ్కు బయల్దేరారు. నిందితుడిని ముంబై తీసుకెళ్లి ఇంటరాగేషన్ చేయనున్నారు.
News January 18, 2025
రైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం: KTR
TG: బ్యాంకులో రైతు దేవ్రావ్ <<15189347>>ఆత్మహత్యకు<<>> ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ చేయకపోవడం వల్లే ఆయన బలవన్మరణం చెందారని అన్నారు. పదేళ్లు రాజుగా బతికిన రైతన్న ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో అవస్థల పాలవుతున్నాడని వాపోయారు. ఇది ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యగానే రైతాంగం భావిస్తోందని విమర్శించారు. బాధిత కుటుంబానికి రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.