News February 19, 2025
పాకిస్థాన్లో రెపరెపలాడిన భారత జెండా

ఎట్టకేలకు పాకిస్థాన్లో భారత జెండా రెపరెపలాడింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అన్ని దేశాల పతాకాలు ఆతిథ్య దేశం స్టేడియాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ భారత మువ్వన్నెల పతాకాన్ని పాక్ క్రికెట్ బోర్డు విస్మరించింది. నిబంధనలు ఉల్లంఘించిన పాక్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో దిగొచ్చిన పీసీబీ ఇండియన్ ఫ్లాగ్ను ఇవాళ కరాచీలోని స్టేడియంపై ఏర్పాటు చేసింది.
Similar News
News March 27, 2025
శ్రీశైలంలో నేటి నుంచే ఉగాది ఉత్సవాలు

AP: శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభంకానున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. వేడుకల్లో భాగంగా రోజూ సాయంత్రం అమ్మవారికి, స్వామివార్లకు ప్రత్యేక అలంకరణలు, వాహన సేవ చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఉత్సవ మూర్తులకు రాత్రి 7గం. గ్రామోత్సవం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలు నేటినుంచి ఐదురోజుల పాటు జరగనున్నాయి.
News March 27, 2025
UPI పేమెంట్స్ చేసేవారు ఇది తెలుసుకోండి!

నిన్న ఒక్కసారిగా UPI పేమెంట్స్ పనిచేయకపోవడంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఒక్కోసారి ఇంటర్నెట్ సిగ్నల్ సరిగా లేకపోయినా UPI పేమెంట్స్ చేయలేం. అలాంటప్పుడు ఇలా చేయండి. తొలుత బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి *99# డయల్ చేస్తే మెనూ వస్తుంది. మనీ సెండింగ్, రిక్వెస్ట్ మనీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ ఆప్షన్లలో కావాల్సింది ఎంచుకోండి. రిసీవర్ మొబైల్ నంబర్, UPI ఐడీ ఎంటర్ చేసి డబ్బు పంపించండి.
News March 27, 2025
భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎన్కౌంటర్

జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో భద్రతా బలగాల ఎన్కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతోంది. నేడు రాజ్బాగ్ సమీపంలోని ఘాటి జుథానాలో ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చారు. హిరానగర్ సెక్టార్లో ఆదివారం నాటి యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్లో తప్పించుకున్న ముష్కరులనే నేడు చంపేశారని సమాచారం. నాలుగు రోజులుగా ఇక్కడ టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతోంది.