News September 15, 2024
భారత దిగ్గజాలు ఇండియాను పాక్కు పంపండి.. ప్లీజ్: మోయిన్

పాకిస్థాన్లో ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ను పంపేలా క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సచిన్, ద్రవిడ్, గంగూలీ బీసీసీఐతో మాట్లాడాలని పాక్ మాజీ క్రికెటర్ మోయిన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. ‘క్రికెట్ ఆగకూడదు. ఇరు దేశాలు ఆడటమనేది పాక్తో పాటు మొత్తం క్రికెట్కు మంచిది. ఇండియా రాకపోతే పాక్ కూడా భారత్లో పర్యటించకూడదు’ అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
Similar News
News December 6, 2025
ఇండిగో సంక్షోభం వేళ రైల్వే కీలక నిర్ణయం

ఇండిగో ఫ్లైట్స్ రద్దు కారణంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 37 రైళ్లకు 116 అదనపు కోచ్లు అనుసంధానించినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దక్షిణ రైల్వేలో 18 రైళ్లకు అత్యధికంగా కోచ్లు పెంచారు. ఉత్తర, పశ్చిమ, తూర్పు, ఈశాన్య రైల్వే జోన్లలో కూడా స్పెషల్ కోచ్లు ఏర్పాటు చేశారు. అదనంగా 4 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు.
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


