News February 17, 2025
ఇండోనేషియాకు చేరుకున్న భారత నేవీ విమానం, నౌక

భారత నేవీకి చెందిన నౌక ఐఎన్ఎస్ శార్దూల్, పీ8ఐ నిఘా విమానం ఇండోనేషియాకు చేరుకున్నాయి. అక్కడ జరిగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో పాటు ఇరు దేశాల సంయుక్త నౌకాదళ విన్యాసాల్లో అవి పాల్గొననున్నాయి. మరోవైపు బ్రహ్మాస్ సూపర్ సోనిక్ క్షిపణుల కొనుగోలుకు ఇండోనేషియా భారత్తో చర్చలు జరుపుతోంది. ఈ డీల్ విలువ సుమారు 300 మిలియన్ డాలర్ల విలువ ఉండొచ్చని అంచనా.
Similar News
News April 17, 2026
డీలిమిటేషన్.. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఇలా..

డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని మోదీని నిన్న లోక్సభలో పునరుద్ఘాటించారు. కేంద్రం లెక్కల ప్రకారం సౌత్ స్టేట్స్లో సీట్ల పెంపు ఇలా ఉంటుంది.
☞ ఏపీ 25 నుంచి 38కి, ☞ తెలంగాణ 17 నుంచి 26కు, ☞ తమిళనాడు 39 నుంచి 59కి, ☞ కర్ణాటక 28 నుంచి 42కు, ☞ కేరళం 20 నుంచి 30కి పెరగనున్నాయి. మొత్తంగా 5 దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడున్న 129 ఎంపీ సీట్లు 195కి చేరతాయి.
News April 17, 2026
4 కులాల్లోనే 40శాతం మంది పేదలు!

TGలో కులాల మధ్య అసమానతల తీవ్రతను సీపెక్ సర్వే బహిర్గతం చేసింది. రూ.లక్షలోపు వార్షికాదాయం కలిగిన 1.10కోట్ల మంది నిరుపేదల్లో 40% మంది మాదిగ, లంబాడా, ముదిరాజ్, యాదవులేనని పేర్కొంది. విద్యాపరంగానూ అసమానతలు ఉన్నాయంది. కొన్ని కులాల్లో ఉన్నత విద్యావంతులు 35.37% ఉండగా మరికొన్ని కులాల్లో ఇది 5% లోపేనని తెలిపింది. మాదిగ, STల్లోనే అత్యధిక బాలకార్మికులు ఉన్నారని, వడ్డెరలో 55% మంది దినసరి కూలీలని చెప్పింది.
News April 17, 2026
గుజరాత్తో పోరు.. కోల్‘కథ’ మారేనా?

IPLలో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్తో కోల్కతా నైట్రైడర్స్ తలపడనుంది. ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచు(వర్షం వల్ల ఒకటి రద్దు)ల్లోనూ KKR ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నేటి పోరులో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు GT తొలి 2 మ్యాచుల్లో ఓడినా తర్వాత పుంజుకుని 2 గెలిచింది. కెప్టెన్ గిల్, బట్లర్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ ఫామ్లో ఉండటంతో ఇదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది.


