News March 10, 2025
భారత సంతతి విద్యార్థిని మిస్సింగ్

అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్ టూర్కు వెళ్లి ప్యూంటా కానా బీచ్ వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆమె కోసం పోలీసులు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో తీవ్రంగా గాలిస్తున్నారు. వర్జీనియాలో ఉంటున్న సుదీక్ష పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుతోందని ఆమె తండ్రి సుబ్బరాయుడు తెలిపారు.
Similar News
News October 31, 2025
DRDOలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

DRDO అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో 5 రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. MS, MSc, ME, M.TECH, పీహెచ్డీ, బీఈ, బీటెక్, నెట్, గేట్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in/
News October 31, 2025
ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసిన ‘సర్దార్’

1947లో స్వాతంత్ర్యం నాటికి దేశంలో 565 సంస్థానాలున్నాయి. అప్పుడు రంగంలోకి దిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ HYD, కశ్మీర్, జునాగఢ్ మినహా అన్నీ దేశంలో కలిసిపోయేలా చేశారు. ఆ తర్వాత వాటిపైనా దృష్టి పెట్టారు. కశ్మీర్, జునాగఢ్ సంస్థానాధీశులతో పాటు అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన HYD నిజాం మెడలు వంచారు. ఆపరేషన్ పోలో చేపట్టి హైదరాబాద్ ప్రజలకు విముక్తి కల్పించారు. దేశాన్ని ఒక్కటిగా చేశారు. నేడు ‘సర్దార్’ జయంతి.
News October 31, 2025
నెట్వర్క్ ఆస్పత్రులకు వన్ టైం సెటిల్మెంట్!

AP: ‘NTR వైద్య సేవ’ కింద నెట్వర్క్ ఆస్పత్రులకు వన్టైం సెటిల్మెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ASHA ప్రతినిధులతో భేటీ అయిన అధికారులు 20 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని కోరగా, ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని వారు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.250CR రిలీజ్ చేసి, విడతల వారీగా చెల్లిస్తామన్నా సమ్మె విరమించలేదు. దీంతో వన్టైం సెటిల్మెంటే మార్గమని భావిస్తున్నట్లు సమాచారం.


