News March 10, 2025
భారత సంతతి విద్యార్థిని మిస్సింగ్

అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్ టూర్కు వెళ్లి ప్యూంటా కానా బీచ్ వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆమె కోసం పోలీసులు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో తీవ్రంగా గాలిస్తున్నారు. వర్జీనియాలో ఉంటున్న సుదీక్ష పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుతోందని ఆమె తండ్రి సుబ్బరాయుడు తెలిపారు.
Similar News
News March 26, 2026
గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు

AP: గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని స్కూళ్లు, కాలేజీల్లో 2026-27లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 7 వరకు పొడిగించినట్లు సెక్రటరీ కృష్ణమోహన్ తెలిపారు. 5వ క్లాస్తోపాటు 6, 7, 8 తరగతుల్లో మిగిలిన ఖాళీలు (APRS CAT-2026), ఇంటర్, డిగ్రీ మొదటి ఏడాది (APRJC & DC CET-2026) ప్రవేశాలకు ఈ గడువు వర్తిస్తుందన్నారు. అర్హత గల అభ్యర్థులు <
News March 26, 2026
IPL: RCB-SRH మ్యాచ్ జరుగుతుందా?

ఎల్లుండి సాయంత్రం IPLలో RCB-SRH ప్రారంభ మ్యాచ్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ మ్యాచ్ జరగనున్న చిన్నస్వామి స్టేడియం మాత్రం ఇంకా రెడీ కాలేదు. గతేడాది తొక్కిసలాట తర్వాత రెనోవేషన్ పనులు చేపట్టగా తొలి మ్యాచ్ రోజు నాటికి పూర్తవుతుందా అనేది పెద్ద ప్రశ్న. వాస్తవానికి స్టేడియం పనుల పూర్తికి ఈ నెల 15 డెడ్లైన్ కాగా పనులన్నీ ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. మరో 48 గంటల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
News March 26, 2026
రేపు జాగ్రత్త: APSDMA

AP: రాష్ట్రంలో రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. మన్యం (D) గుమ్మలక్ష్మీపురం, కురుపాం, అల్లూరి(D) చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, కాకినాడ(D) జగ్గంపేట, తూ.గో.(D) కోరుకొండ, ఎన్టీఆర్(D) జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని చెప్పింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అత్యవసరమైతేనే బయటకు రావాలంది. మంచి నీరు, మజ్జిగ, ORS ఎక్కువగా తాగాలని సూచించింది.


