News May 23, 2024

ఎల్లుండి అమెరికాకు భారత ఆటగాళ్లు?

image

టీ20 వరల్డ్ కప్ కోసం ఈ నెల 25న టీమ్ఇండియా ప్లేయర్లు, సిబ్బంది అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన జట్లలోని ఆటగాళ్లు యూఎస్ విమానం ఎక్కనున్నట్లు సమాచారం. మొదట రోహిత్, కోహ్లీ, హార్దిక్, బుమ్రా, సూర్య, పంత్, అక్షర్, అర్ష్‌దీప్, కుల్దీప్, సిరాజ్‌ వెళ్లనుండగా.. ఐపీఎల్ ఫైనల్ తర్వాత మిగతా ప్లేయర్స్ అక్కడికి చేరుకోనున్నారట. దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.

Similar News

News July 10, 2025

LORDS TEST: నితీశ్ స్థానంలో అర్ష్‌దీప్?

image

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగబోయే మూడో టెస్టుకు భారత్ రెండు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచులో అంతగా ఆకట్టుకోని తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డి స్థానంలో పేసర్ అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ స్థానంలో బుమ్రాను ఆడించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. జట్టు అంచనా: జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, గిల్ (కెప్టెన్), పంత్, జడేజా, సుందర్, ఆకాశ్ దీప్, సిరాజ్, బుమ్రా, అర్ష్‌దీప్.

News July 10, 2025

GPO రెండో విడత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

TG: గ్రామ పాలన అధికారుల(GPO) భర్తీకి రెండో విడత నోటిఫికేషన్ విడుదలైంది. 10,954 పోస్టుల భర్తీకి మార్చి 29న మొదటి నోటిఫికేషన్ రాగా 3,550 మంది ఎంపికయ్యారు. మిగతా ఖాళీల్లోనూ గతంలో వీఆర్ఏ, వీఆర్వోలుగా చేసిన వారికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ నెల 16లోపు కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 27న GPO పరీక్ష నిర్వహించనున్నారు.

News July 10, 2025

BREAKING: ఢిల్లీలో భూకంపం

image

దేశ రాజధాని ఢిల్లీతోపాటు హరియాణా, యూపీలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4గా నమోదైంది. 15 సెకన్లపాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. హరియాణాలోని రోహ్‌తక్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.