News June 18, 2024
వచ్చే వారం జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన
జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం జట్టును అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. కాగా జింబాబ్వేతో భారత్ 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్లన్నీ హరారేలో జరగనున్నాయి. జులై 6 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. 6న తొలి టీ20, 7న రెండో, 10న మూడో, 13న నాలుగో, 14న చివరి మ్యాచ్ జరగనుంది.
Similar News
News October 7, 2024
‘దేవర-2’ షూటింగ్ అప్పటి నుంచేనా?
‘దేవర-2’ సినిమా షూటింగ్ 2025, అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు తెలిపాయి. పార్ట్-1కి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పార్ట్-2కి పనిచేయకపోవచ్చని సమాచారం. దీనిపై మూవీ టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. గత నెల 27న థియేటర్లలో విడుదలైన ‘దేవర’ ఇప్పటివరకు రూ.460కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. పార్ట్-1లో చాలా విషయాలను డైరెక్టర్ సస్పెన్స్లో పెట్టారు. దీంతో పార్ట్-2పై ఆసక్తి నెలకొంది.
News October 7, 2024
లెబనాన్పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు.. 10 మంది మృతి
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో 10 మంది మృతి చెందారు. బారాషీట్లోని అగ్నిమాపక కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. దాడి సమయంలో స్థానికంగా రెస్క్యూ మిషన్కు వెళ్లడానికి సిద్ధమవుతున్న 10 మంది పౌర రక్షణ సభ్యులు మరణించినట్టు వెల్లడించింది. సెప్టెంబర్ చివర్లో ప్రారంభించిన ఇజ్రాయెల్ వరుస దాడుల్లో 1,400 మంది హెజ్బొల్లా సభ్యులు, పౌరులు మృతి చెందారు.
News October 7, 2024
కేంద్ర మంత్రులతో CM రేవంత్ భేటీ
ఢిల్లీలో ఉన్న CM రేవంత్ కేంద్ర మంత్రులు అమిత్ షా, మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ ప్రక్షాళన వంటి పనులకు సహాకారం అందించాలని కోరారు. CSMPని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సాయం చేయాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. HYDలో పురాతన మురుగుశుద్ధి వ్యవస్థ ఉందని, అది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని వివరించారు.