News July 17, 2024
శ్రీలంక సిరీస్కు భారత జట్టు ఎంపిక వాయిదా?

శ్రీలంకతో జరగబోయే టీ20, వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత ఇవాళ జట్టును ప్రకటించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ జట్టు ఎంపికను సెలక్షన్ కమిటీ వాయిదా వేసినట్లు సమాచారం. టీ20 కెప్టెన్సీ విషయంలో కోచ్, సెలక్టర్లు, బీసీసీఐ మల్లగుల్లాలు పడుతున్నట్లు టాక్. హార్దిక్, సూర్యలలో ఎవరిని సారథిగా నియమించాలనేదానిపై ఇంకా క్లారిటీ రానట్లు తెలుస్తోంది.
Similar News
News November 20, 2025
సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడుకుందో తెలుసా?

సావిత్రి తన వాక్చాతుర్యంతో భర్త సత్యవంతుడి ప్రాణాలను కాపాడుకుంది. యముడు తన భర్త ప్రాణాలను తీసుకొని వెళ్తుంటే అడ్డుపడింది. ధర్మబద్ధమైన సంభాషణలతో యముడిని మెప్పించి, 3 వరాలు పొందింది. మూడో వరంగా సత్యవంతుడి ద్వారా 100 మంది పుత్రులు కావాలని కోరింది. యముడు వరమివ్వగానే ‘నా భర్త మీ వెంట ఉంటే, నాకు పుత్రులు ఎలా కలుగుతారు?’ అని ప్రశ్నించింది. భర్త ప్రాణాలు తీయడానికి వచ్చిన యముడి చేతే భర్తను బతికించుకుంది.
News November 20, 2025
ఈ అలవాట్లతో రోగాలకు దూరం: వైద్యులు

ఆరోగ్య సమస్యలను డైలీ హ్యాబిట్స్ ద్వారా దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ‘రోజుకు 10వేల అడుగులు నడిస్తే శారీరక & మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. మెడిటేషన్ చేస్తే ఒత్తిడి & ఆందోళన తగ్గుతుంది. ఒకే సమయానికి నిద్ర పోవడం & మేల్కోవడం చేయాలి. సూర్యరశ్మి తగిలితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్ను తినకపోవడం బెస్ట్. బ్యాలెన్స్ డైట్ తీసుకోండి’ అని సూచిస్తున్నారు.
News November 20, 2025
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు రాష్ట్రపతికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆమె బస చేయనున్నారు. రేపు ఉదయం రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుపతి పర్యటన ముగిసిన తర్వాత హైదరాబాద్కు బయల్దేరి వెళ్లనున్నారు.


