News May 23, 2024

అదరగొట్టిన భారత మహిళల ఆర్చరీ జట్టు

image

ప్రపంచ కప్ స్టేజ్-2 టోర్నీలో భారత మహిళల ఆర్చరీ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏపీకి చెందిన జ్యోతి సురేఖ, పర్ణిత్ కౌర్, అదితి స్వామి బృందం సెమీ ఫైనల్లో 233-229 పాయింట్లతో అమెరికాను ఓడించింది. శనివారం ఫైనల్లో టర్కీతో భారత జట్టు పోటీ పడుతుంది. కాగా షాంఘైలో గత నెలలో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్-1 టోర్నీలో జ్యోతి సురేఖ బృందం గోల్డ్ మెడల్ సాధించింది.

Similar News

News March 11, 2026

ట్రంప్ కీలక నిర్ణయం.. రిలయన్స్‌తో భారీ డీల్

image

అమెరికాలోని టెక్సాస్‌లో భారీ ఆయిల్ రిఫైనింగ్ ప్రాజెక్టును అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత USలో ఏర్పాటవుతున్న తొలి రిఫైనరీ ఇదే. ఈ $300 బిలియన్ల ప్రాజెక్టులో రిలయన్స్ పార్ట్‌నర్‌గా చేరుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అందుకు కంపెనీకి థాంక్స్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే క్లీన్లీయెస్ట్ రిఫైనరీ అని, వేలాది ఉద్యోగాలు రావడమే కాకుండా అమెరికా ఎనర్జీ సెక్యూరిటీ పెరుగుతుందని పేర్కొన్నారు.

News March 11, 2026

రాష్ట్ర ప్రజలకు CM ఉగాది కానుక

image

AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు ఉగాది కానుక ప్రకటించారు. ఉగాది రోజున 2.50 లక్షల మంది లబ్ధిదారుల సామూహిక నూతన గృహ ప్రవేశ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. వారికి ప్రభుత్వం తరఫు నుంచి అధికారిక లేఖ వెళ్లేలా చూడాలని ఆదేశించారు. కాగా 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు.

News March 11, 2026

చిన్న సంస్థ.. పెద్ద దెబ్బ: అమెరికా యుద్ధ రహస్యాలు లీక్

image

చైనాకు చెందిన మిజార్‌విజన్ అనే చిన్న సంస్థ AI సాయంతో అమెరికా యుద్ధ వ్యూహాలను బట్టబయలు చేసింది. ఫిబ్రవరిలో ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ప్రారంభానికి ముందే ఇజ్రాయెల్, సౌదీలోని అమెరికా వైమానిక స్థావరాలు, యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థల హై-రిజల్యూషన్ ఫొటోలను ఈ సంస్థ SMలో విడుదల చేసింది. జిలిన్-1 ఉపగ్రహాల ద్వారా సేకరించిన ఈ సమాచారం ఇరాన్ దాడులకు పరోక్షంగా సహకరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.