News May 26, 2024

ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే దేశానికి మేలు: భట్టి

image

ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే దేశానికి మేలు జరుగుతుందని తెలంగాణ డిప్యూటీ CM భట్టి విక్రమార్క అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పార్టీ తరఫున పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. తాము అధికారంలోకి రాగానే ఆయా రంగాల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను AUG 15లోపు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ను చూసి BJP భయపడుతోందని, అందుకే తమ నేతలపై మోదీ విమర్శలు చేస్తున్నారని అన్నారు.

Similar News

News October 19, 2025

CBN విషయంలో తప్పని రియలైజ్ అయ్యాను: జోగి రమేష్

image

AP: గతంలో అసెంబ్లీ చంద్రబాబు బాధపడిన విషయంలో తాము తప్పు చేశామని తన భార్య చెప్పిందని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. అది తప్పని తర్వాత తానూ రియలైజ్ అయినట్లు తెలిపారు. తమ మధ్య రాజకీయ వైరమే ఉందని, ఇతర విషయాల్లో అందరిని గౌరవిస్తానని పేర్కొన్నారు. పార్టీ మారబోనని, YSR బ్రాండ్‌తో జగన్ వెంట కొనసాగుతానని తెలిపారు. నకిలీ మద్యం <<18043835>>కేసులో<<>> చంద్రబాబు తనపై కక్ష కట్టారని ఆరోపించారు.

News October 19, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 19, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.15 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.52 గంటలకు
✒ ఇష: రాత్రి 7.04 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 19, 2025

Dhanteras: 50 వేల కార్లు డెలివరీ చేస్తున్న మారుతి సుజుకీ!

image

ధన్‌తేరాస్ సందర్భంగా రికార్డు స్థాయిలో 50 వేల కార్లను డెలివరీ చేస్తున్నట్లు మారుతి సుజుకీ తెలిపింది. శనివారం 41 వేల కార్లను కస్టమర్లకు అందజేశామని చెప్పింది. ఆదివారం మరో 10 వేలు డెలివరీ చేస్తామని, తద్వారా 51 వేల కార్ల రికార్డును అందుకునేందుకు ప్రయత్నిస్తామని సంస్థ SEO పార్థో బెనర్జీ తెలిపారు. కాగా ఈ ఏడాది ధన్‌తేరాస్ శనివారం మధ్యాహ్నం 12.18కి ప్రారంభమై, ఇవాళ మధ్యాహ్నం 1.51గం. దాకా కొనసాగనుంది.