News May 26, 2024

ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే దేశానికి మేలు: భట్టి

image

ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే దేశానికి మేలు జరుగుతుందని తెలంగాణ డిప్యూటీ CM భట్టి విక్రమార్క అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పార్టీ తరఫున పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. తాము అధికారంలోకి రాగానే ఆయా రంగాల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను AUG 15లోపు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ను చూసి BJP భయపడుతోందని, అందుకే తమ నేతలపై మోదీ విమర్శలు చేస్తున్నారని అన్నారు.

Similar News

News November 28, 2025

రోజుకు 30-35 లీటర్ల పాలు.. ఈ ఆవులతో డెయిరీఫామ్ మేలు

image

ప్రపంచంలోనే అత్యధికంగా పాలిచ్చే ఆవు జాతుల్లో హోలిస్టిన్ ఫ్రీజియన్ ఒకటి. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఒక ఈతలో 9వేల లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. ఇవి రోజుకు కనీసం 25-30 లీటర్లు, కొన్ని సందర్భాల్లో 35-40 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాలలో కొవ్వు 3.5%గా, ప్రొటీన్ 3.1%గా ఉంటుంది. ఈ రకం ఆవులతో డెయిరీఫామ్ నిర్వహణ మేలంటున్నారు వెటర్నరీ నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.

News November 28, 2025

అవసరమైతే కోర్టులో మూలన నిలబెట్టగలం.. రంగనాథ్‌పై HC తీవ్ర ఆగ్రహం

image

TG: అంబర్‌పేట బతుకమ్మ కుంట వ్యవహారంలో విచారణకు హాజరుకాకపోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై HC ఆగ్రహించింది. న్యాయస్థానం ఉత్తర్వులపై గౌరవం లేదా అని ప్రశ్నించింది. అవసరమైతే ఉ.10.30 గంటల నుంచి సా.4.30 గంటల వరకు కోర్టులో ఓ మూలన నిలబెడతామని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బతుకమ్మ కుంట భూవివాదం కొనసాగుతుండగానే పనులు చేపట్టారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది.

News November 28, 2025

ఇతిహాసాలు క్విజ్ – 80

image

ఈరోజు ప్రశ్న: ఉప పాండవులను చంపింది ఎవరు? ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>