News April 12, 2024
భారత్ దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు
భారతీయుల దెబ్బకు మాల్దీవులు దిగొచ్చింది. భారత పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మాలేలో భారత హైకమిషనర్తో చర్చలు జరిపింది. భారత్లోని ప్రముఖ ట్రావెల్ అసోసియేషన్లు, పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఇరుదేశాల మధ్య పర్యాటక సంబంధాలు మెరుగుపరచుకునేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.
Similar News
News October 11, 2024
తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు
AP: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
News October 11, 2024
మద్యం దుకాణాల దరఖాస్తులకు నేడే ఆఖరు
AP: రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకు 65,629 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇవాళ మరో 20వేల వరకు అప్లికేషన్లు వస్తాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో 12 చోట్ల షాపులకు ఒక్కోటి చొప్పున, 46 దుకాణాలకు రెండేసి దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
News October 11, 2024
రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి
AP: ఈ నెల 17న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. రాష్ట్ర స్థాయి వేడుకను అనంతపురంలో నిర్వహిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్లు ఆయా జిల్లాల్లో అధికారులకు ఆదేశాలివ్వాలన్నారు.