News April 12, 2024
భారత్ దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు

భారతీయుల దెబ్బకు మాల్దీవులు దిగొచ్చింది. భారత పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మాలేలో భారత హైకమిషనర్తో చర్చలు జరిపింది. భారత్లోని ప్రముఖ ట్రావెల్ అసోసియేషన్లు, పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఇరుదేశాల మధ్య పర్యాటక సంబంధాలు మెరుగుపరచుకునేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.
Similar News
News March 17, 2025
రేపు ఢిల్లీకి చంద్రబాబు

AP: అమరావతి పున: ప్రారంభ పనుల ఆరంభోత్సవానికి PM మోదీని ఆహ్వానించేందుకు CM చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పీఎంతో ఆయన బుధవారం భేటీ కానున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులు, అమరావతికి సాయం సహా వివిధ అంశాలపై ఆయన మోదీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతారని సమాచారం.
News March 17, 2025
నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. ALL THE BEST

AP: నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉ.9.30 నుంచి మ.12.45 వరకు పరీక్ష ఉంటుంది. ఉ.8.45 గం. నుంచే సెంటర్లలోకి అనుమతిస్తారు. 6.49 లక్షల మంది విద్యార్థుల కోసం 3,450 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఫోన్లు, స్మార్ట్ వాచ్లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
*Way2News తరఫున ALL THE BEST
News March 17, 2025
ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్ కూడా నేటి నుంచే..

AP: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదో తరగతి (ఓపెన్ టెన్త్) పరీక్షలు కూడా నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ పరీక్షలు జరిగే తేదీలు, సమయాల్లోనే ఈ ఎగ్జామ్స్ ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఓపెన్ టెన్త్ పరీక్షలు ఈ నెల 28తో ముగియనున్నాయి. మొత్తం 30,334 మంది కోసం 471 సెంటర్లను ఏర్పాటు చేశారు.