News January 1, 2025
భారత్కు పెరిగిన సముద్ర తీరం.. కారణమిదే

భారత సముద్ర తీరం 48శాతం మేర పెరిగిందని కేంద్ర హోం శాఖ తాజా నివేదికలో తెలిపింది. 1970 డేటా ప్రకారం తీరం పొడవు 7516 కి.మీ ఉంది. కానీ నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ తాజా విధానాల ప్రకారం ఈసారి వంపుల్ని కూడా లెక్కించారు. దీంతో పొడవు 11,098.81 కి.మీగా అయింది. AP కోస్టల్ ఏరియా పొడవు గతంలో 973.70 కి.మీ ఉండగా అది ఇప్పుడు 1053.07కి చేరింది. అత్యధికంగా గుజరాత్కు 92.69శాతం మేర తీరం పొడవు కొత్తగా కలిసింది.
Similar News
News November 23, 2025
నోబెల్ వచ్చినా దేశం దాటలేని పరిస్థితి

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి విన్నర్ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డిసెంబర్ 10న నార్వేలో జరిగే నోబెల్ పురస్కారాల వేడుకకు హాజరైతే, ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఆ దేశ అటార్నీ జనరల్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినందుకు ఆమెకు నోబెల్ బహుమతి ప్రకటించినప్పటికీ, దేశం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
News November 23, 2025
హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

HYDలోని CSIR-NGRI 3 ప్రాజెక్ట్ అసోసియేట్, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 27వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc, MSc, M.Tech (జియో ఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్, మెరైన్ జియోఫిజిక్స్), MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. NOV 28, DEC 3 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. https://www.ngri.res.in/
News November 23, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.220గా ఉంది. చిత్తూరులో రూ.219-232 వరకు పలుకుతోంది. మటన్ కేజీ రూ.800-900 మధ్య ఉంది. అటు కోడిగుడ్డు రూ.7వరకు అమ్ముతున్నారు. కార్తీక మాసం ముగియడంతో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.


