News January 1, 2025

భారత్‌కు పెరిగిన సముద్ర తీరం.. కారణమిదే

image

భారత సముద్ర తీరం 48శాతం మేర పెరిగిందని కేంద్ర హోం శాఖ తాజా నివేదికలో తెలిపింది. 1970 డేటా ప్రకారం తీరం పొడవు 7516 కి.మీ ఉంది. కానీ నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ తాజా విధానాల ప్రకారం ఈసారి వంపుల్ని కూడా లెక్కించారు. దీంతో పొడవు 11,098.81 కి.మీగా అయింది. AP కోస్టల్ ఏరియా పొడవు గతంలో 973.70 కి.మీ ఉండగా అది ఇప్పుడు 1053.07కి చేరింది. అత్యధికంగా గుజరాత్‌కు 92.69శాతం మేర తీరం పొడవు కొత్తగా కలిసింది.

Similar News

News October 24, 2025

APPLY NOW: సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్‌లో 145 పోస్టులు

image

కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్‌ 145 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ICAI/ICOAI/ICSIలో ఇంటర్మీడియట్/ ఎగ్జిక్యూటివ్‌ లెవల్‌లో ఉత్తీర్ణులైన CA/CS/CMS అభ్యర్థులు అర్హులు. వెబ్‌సైట్: https://www.mca.gov.in/ లేదా https://icsi.edu/

News October 24, 2025

అఫ్గాన్ బార్డర్లు క్లోజ్.. పాక్‌లో కేజీ టమాటా రూ.600

image

ఉద్రిక్తతల నేపథ్యంలో అఫ్గాన్-పాక్ బార్డర్లు ఇటీవల మూసేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాల్లో ఫ్రూట్స్, వెజిటెబుల్స్, గోధుమలు, బియ్యం, చక్కెర, మందుల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా పాక్‌లో టమాటాల ధరలు 5 రెట్లు పెరిగి కిలో 600 పాకిస్థానీ రూపాయలు పలుకుతున్నాయి. యాపిల్స్ ధరలు సైతం భారీగా పెరిగాయి. వ్యాపారం స్తంభించిపోయిందని, 2 దేశాలు రోజుకు $1M నష్టపోతున్నాయని అక్కడి వ్యాపార వర్గాలు తెలిపాయి.

News October 24, 2025

వంటింటి చిట్కాలు

image

* పకోడీలు చేసేటప్పుడు పిండిలో కొంచెం సోడా కలిపితే అవి బాగా పొంగుతాయి.
* వెల్లుల్లిని దంచి నీటిలో కలిపి.. బొద్దింకలు ఎక్కువగా ఉండే చోట పెడితే వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు.
* కూరలో నూనె ఎక్కువైతే రెండు బ్రెడ్ ముక్కలను పొడి చేసి వేయడం వల్ల నూనెను పీల్చుకోవడంతో పాటు, కూర రుచిగా ఉంటుంది.
* చేతులకు కొబ్బరినూనె రాసుకొని పచ్చిమిర్చి కోస్తే, చేతులు మండవు.