News January 1, 2025
భారత్కు పెరిగిన సముద్ర తీరం.. కారణమిదే
భారత సముద్ర తీరం 48శాతం మేర పెరిగిందని కేంద్ర హోం శాఖ తాజా నివేదికలో తెలిపింది. 1970 డేటా ప్రకారం తీరం పొడవు 7516 కి.మీ ఉంది. కానీ నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ తాజా విధానాల ప్రకారం ఈసారి వంపుల్ని కూడా లెక్కించారు. దీంతో పొడవు 11,098.81 కి.మీగా అయింది. AP కోస్టల్ ఏరియా పొడవు గతంలో 973.70 కి.మీ ఉండగా అది ఇప్పుడు 1053.07కి చేరింది. అత్యధికంగా గుజరాత్కు 92.69శాతం మేర తీరం పొడవు కొత్తగా కలిసింది.
Similar News
News January 16, 2025
‘ముక్కనుమ’ గురించి తెలుసా?
సంక్రాంతి వేడుకలు చాలా చోట్ల మూడు రోజులే చేసుకున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం నాలుగో రోజు కూడా నిర్వహిస్తారు. దీనినే ముక్కనుమ అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఊర్లోని గ్రామదేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కనుమ రోజున మాంసం తినని వారు ఈ రోజున భుజిస్తారు. ఈ పండుగను ఎక్కువగా తమిళనాడులో నిర్వహించుకుంటారు. తమిళులు దీనిని కరినాళ్ అని పిలుస్తారు.
*ముక్కనుమ శుభాకాంక్షలు
News January 16, 2025
పౌరులకు మానవతా సాయం అందించండి: యూఎన్ చీఫ్
ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు UN చీఫ్ అంటోనీ గుటెర్రస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేసిన ఈజిఫ్టు, ఖతార్, యూఎస్ఏను ఆయన అభినందించారు. బాధిత పౌరులకు అవసరమైన మానవతా సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఎదురయ్యే సవాళ్లను తెలుసుకొని సాధ్యమయ్యే ప్రతిదీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని యూకే ప్రధాని స్టార్మర్ స్వాగతించారు.
News January 16, 2025
ఇండియా ఓపెన్: ప్రణయ్, లక్ష్యసేన్ ఔట్
ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు నిరాశే ఎదురైంది. పురుషల సింగిల్స్లో స్టార్ ప్లేయర్లు లక్ష్యసేన్, ప్రణయ్ ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్లో మాళవిక, ఆకర్షి ఓడిపోయారు. మరోవైపు ఇవాళ స్టార్ ప్లేయర్ సింధు జపాన్ క్రీడాకారిణి సుజుతో తలపడనున్నారు. మరో ప్లేయర్ అనుపమ ఉపాధ్యాయ జపాన్కు చెందిన మియజాకితో పోటీ పడనున్నారు.