News July 11, 2024
కోహ్లీ పాక్కు వస్తే ఇండియా ఆతిథ్యాన్ని మర్చిపోతారు: అఫ్రీది

కోహ్లీ పాకిస్థాన్లో క్రికెట్ ఆడితే చూడటానికి ఎదురుచూస్తున్నట్లు ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది తెలిపారు. ‘విరాట్కు పాక్లో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అతను మా దేశానికి వస్తే ఇండియాలోని ఆతిథ్యాన్ని మర్చిపోతారు. అంతగొప్పగా కోహ్లీని చూసుకుంటాం’ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది పాక్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత్ రావాలని ఆ దేశం కోరుకుంటోంది. అది అసాధ్యమని BCCI వర్గాలు స్పష్టం చేశాయి.
Similar News
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.
News November 27, 2025
వైట్ ఎగ్స్కు రంగేసి నాటుకోడి గుడ్లంటూ..!

ఉత్తర్ప్రదేశ్లోని మురాదాబాద్లో నకిలీ నాటు కోడి గుడ్లను తయారుచేస్తోన్న ముఠాను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. బ్రాయిలర్ ఎగ్స్(వైట్)కు రంగులు పూసి నాటు కోడి గుడ్లంటూ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 4.5లక్షలకు పైగా గుడ్లను రంగు మార్చి అమ్మినట్లు గుర్తించగా.. గోదాంలో రెడీ అవుతోన్న మరో 45వేల ఎగ్స్ను సీజ్ చేశారు. ఇలాంటి నకిలీ గుడ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.


