News July 11, 2024
కోహ్లీ పాక్కు వస్తే ఇండియా ఆతిథ్యాన్ని మర్చిపోతారు: అఫ్రీది

కోహ్లీ పాకిస్థాన్లో క్రికెట్ ఆడితే చూడటానికి ఎదురుచూస్తున్నట్లు ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది తెలిపారు. ‘విరాట్కు పాక్లో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అతను మా దేశానికి వస్తే ఇండియాలోని ఆతిథ్యాన్ని మర్చిపోతారు. అంతగొప్పగా కోహ్లీని చూసుకుంటాం’ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది పాక్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత్ రావాలని ఆ దేశం కోరుకుంటోంది. అది అసాధ్యమని BCCI వర్గాలు స్పష్టం చేశాయి.
Similar News
News October 22, 2025
భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. HYD బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.3,380 తగ్గి ₹1,27,200కు చేరింది. 22 క్యారెట్ల 10g పసిడిపై రూ.3,100 పతనమై ₹1,16,600గా ఉంది. నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్(31.10g) ధర $245 తగ్గడమే ఇందుకు కారణం అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అటు KG వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,80,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 22, 2025
టీచర్లకూ టెట్.. త్వరలో నోటిఫికేషన్!

AP: టీచర్లకూ టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు జాబ్లో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. నిరుద్యోగులు, టీచర్లకు కలిపి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నవారు రెండేళ్లలో టెట్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
News October 22, 2025
ఏడడుగులు ఎందుకంటే?

మొదటి అడుగు – శారీరక బలం కోసం
రెండో అడుగు – మానసిక బలం కోసం
మూడో అడుగు – ధర్మాచరణ కోసం
నాల్గో అడుగు – కర్మ సంబంధమైన సుఖం కోసం
ఐదో అడుగు – పశు సమృద్ధి కోసం
ఆరో అడుగు – రుతువులలో తగిన ఆరోగ్యం కోసం
ఏడో అడుగు – సంసార జీవితాన్ని ‘ఒక యజ్ఞంగా’ భావించమని చెప్పే ‘స్నేహం’ కోసం
<<-se>>#Pendli<<>>