News October 8, 2024
ఆధిక్యంలో భారతదేశ అత్యంత సంపన్నురాలు

భారతదేశపు అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ హరియాణా ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆమె హిసార్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నారు. కాగా ఆమె 5,103 ఓట్లు లీడింగ్లో ఉన్నారు. ఆమె తర్వాత INC అభ్యర్థి రామ్ నివాస్ రారా, BJP అభ్యర్థి కమల్ గుప్తా ఉన్నారు. సావిత్రి ప్రస్తుతం జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్కు ఛైర్పర్సన్గా ఉన్నారు.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


