News October 8, 2024

ఆధిక్యంలో భారతదేశ అత్యంత సంపన్నురాలు

image

భారతదేశపు అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ హరియాణా ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆమె హిసార్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నారు. కాగా ఆమె 5,103 ఓట్లు లీడింగ్‌లో ఉన్నారు. ఆమె తర్వాత INC అభ్యర్థి రామ్ నివాస్ రారా, BJP అభ్యర్థి కమల్ గుప్తా ఉన్నారు. సావిత్రి ప్రస్తుతం జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్‌‌గా ఉన్నారు.

Similar News

News October 18, 2025

ఒకేసారి ఇద్దరు యువతులతో యువకుడి పెళ్లి!

image

ఒక్కరితో సంసారమే కష్టమవుతోన్న ఈ రోజుల్లో ఓ యువకుడు ఒకేసారి ఇద్దరు యువతుల్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగింది. వసీమ్ షేక్ తన ఇద్దరు స్నేహితురాళ్లు షిఫా షేక్, జన్నత్‌ను ఒకే వేదికపై పెళ్లాడాడు. వాళ్లు ముగ్గురూ చాలా ఏళ్లుగా క్లోజ్ ఫ్రెండ్స్ అని, ఒకరి భావోద్వేగాలను మరొకరు అర్థం చేసుకుని ఇలా ఒక్కటయ్యారని సన్నిహితులు తెలిపారు. దీనిపై SMలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News October 17, 2025

ఆంధ్రప్రదేశ్ న్యూస్ రౌండప్

image

➤ రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఉద్యోగుల సమస్యలపై చర్చ
➤ కృష్ణా జిల్లాలోని వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడపగా మార్చిన ప్రభుత్వం
➤ పిఠాపురం వర్మను జీరో చేశామని నేననలేదు. నా మాటలను వక్రీకరించారు: మంత్రి నారాయణ
➤ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ OCT 24కు పొడిగింపు
➤ న్యూయార్క్ వెళ్లేందుకు MP మిథున్ రెడ్డికి షరతులతో కూడిన అనుమతి జారీ చేసిన ఏసీబీ కోర్టు

News October 17, 2025

కార్పొరేట్ స్కూళ్ల తరహాలో సర్కార్ బడులు: CM

image

TG: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ల తరహాలో తీర్చిదిద్దాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. స్కూళ్లలో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ‘తొలి దశలో ORR లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌పై దృష్టి పెట్టండి. సరైన సౌకర్యాలు లేని స్కూళ్లను దగ్గర్లోని ప్రభుత్వ స్థలాలకు తరలించండి. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు నూతన స్కూల్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించండి’ అని సూచించారు.