News October 8, 2024
ఆధిక్యంలో భారతదేశ అత్యంత సంపన్నురాలు

భారతదేశపు అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ హరియాణా ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆమె హిసార్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నారు. కాగా ఆమె 5,103 ఓట్లు లీడింగ్లో ఉన్నారు. ఆమె తర్వాత INC అభ్యర్థి రామ్ నివాస్ రారా, BJP అభ్యర్థి కమల్ గుప్తా ఉన్నారు. సావిత్రి ప్రస్తుతం జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్కు ఛైర్పర్సన్గా ఉన్నారు.
Similar News
News April 6, 2026
DSP అవినీతి.. పనిమనిషికే బంగ్లా, థార్ కారు

బిహార్కు చెందిన DSP గౌతమ్ కుమార్ అవినీతి కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఆయన ఇంట్లో పనిచేసే మహిళకు ₹కోటి బంగ్లా, థార్ కారు ఉన్నట్లు తేలడం ఇన్వెస్టిగేషన్ టీమ్ను విస్మయానికి గురిచేసింది. ఆయన భార్య, గర్ల్ఫ్రెండ్ కూడా లగ్జరీ లైఫ్ గడుపుతున్నట్లు తాజా విచారణలో తేలింది. సోదాల్లో సుమారు ₹80 కోట్ల విలువైన ప్రాపర్టీలు బయటపడ్డాయి. ఆయన్ను సస్పెండ్ చేసి బ్యాంక్ అకౌంట్లపై దృష్టి పెట్టారు.
News April 6, 2026
GK: ముఖ్య పదవులు.. కనీస వయసు

*రాష్ట్రపతి- 35 ఏళ్లు
*ఉపరాష్ట్రపతి- 35
*గవర్నర్- 35
*ఎమ్మెల్సీ- 30
*రాజ్యసభ సభ్యుడు- 30
*ప్రధాని- 25
*లోక్సభ ఎంపీ- 25
*ఎమ్మెల్యే- 25
*సీఎం- 25
*సర్పంచ్- 21
News April 6, 2026
తొలి హిందీ సినిమాగా ధురంధర్-2 రికార్డు

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ధురంధర్-2 చరిత్ర సృష్టించింది. దేశంలో రూ.1,000 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి హిందీ సినిమాగా ఘనత సాధించింది. నిన్న 18వ రోజు దేశవ్యాప్తంగా 4,030లు షోలు పడగా రూ.3.82 కోట్ల నెట్ వసూలు చేసింది. కాగా ఇండియాలో అత్యధిక నెట్ కలెక్షన్లు (రూ.1,234 కోట్లు) సాధించిన రికార్డు పుష్ప-2 పేరిట ఉంది. ఆ తర్వాత బాహుబలి-2 రూ.1,030 కోట్లతో రెండో స్థానంలో ఉంది.


