News November 17, 2024

మిడ్ మానేరు బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు

image

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 4696 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టులో మొత్తం 10683 కుటుంబాలు నిర్వాసితులు కాగా ఇప్పటికే 5987 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు. మిగిలిన వారికి తాజాగా ఇళ్లు మంజూరు చేశారు.

Similar News

News September 17, 2025

మావోయిస్టు పార్టీ లేఖపై అనుమానాలు!

image

ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట రిలీజైన లేఖపై ప్రజా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘ఇప్పటి వరకు ఇలా సంతకం, ఫొటోతో లేఖ రిలీజ్ కాలేదు. AUG 15వ తేదీ అని ఉంది. మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలేస్తామనే ప్రకటన ఇంత సులభంగా ఉండదు. దానికి దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ ఉంటుంది’ అని చెబుతున్నారు. మరోవైపు ఈ లేఖను వెరిఫై చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

News September 17, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గి రూ.1,11,710కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.200 పతనమై రూ.1,02,400 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,42,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 17, 2025

‘అరబ్-ఇస్లామిక్’ NATO.. భారత్‌కు నష్టమా?

image

ఖతర్‌‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ దోహాలో 40కి పైగా అరబ్, ఇస్లామిక్ దేశాలు 2 రోజుల క్రితం సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా <<7824953>>NATO<<>> తరహాలో అరబ్-ఇస్లామిక్ దేశాల మిలిటరీ అలయన్స్‌‌కు ఈజిప్ట్ ప్రతిపాదించింది. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏకైక ముస్లిం దేశమైన పాక్ ఇందుకు మద్దతు తెలిపింది. 180 కోట్ల మంది ముస్లింలు ఇదే కోరుతున్నారని పేర్కొంది. కూటమి ఏర్పాటైతే భారత వ్యతిరేక కార్యకలాపాలను పాక్ ఉద్ధృతం చేసే ప్రమాదముంది.