News February 10, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. నిబంధనలు ఇవే..

image

TG: సర్వే సమయంలో స్థలం చూపిన చోటే నిర్మించాలి. ముగ్గు పోసుకున్నాక గ్రామ కార్యదర్శికి చెబితే ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తారు. 400 చ.అ. కంటే తక్కువగా నిర్మాణం చేపట్టొద్దు. పునాది పూర్తయ్యాక తొలిదశలో రూ.లక్ష జమ చేస్తారు. 8 ట్రాక్టర్ల ఇసుక ఫ్రీగా ఇచ్చి, హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా సిమెంట్, స్టీలు తక్కువ ధరకు అందేలా చూస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే దశను బట్టి AE/MPDOలు నగదు జమకు సిఫార్సు చేస్తారు.

Similar News

News March 26, 2025

గంభీర్‌.. ద్రవిడ్‌ని అనుసరించాలి కదా?: గవాస్కర్

image

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన అనంతరం టీమ్ ఇండియాకు BCCI రూ.58కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. గంభీర్‌కు రూ.3కోట్లు, సపోర్ట్ స్టాఫ్‌కు రూ.50లక్షలు లభించనున్నాయి. దానిపై గవాస్కర్ ప్రశ్నించారు. ‘T20 వరల్డ్ కప్ విజయం అనంతరం ద్రవిడ్ బోర్డు ఇచ్చిన డబ్బును తిరస్కరించారు. సిబ్బందితో సమానంగా ఇవ్వాలని కోరారు. కానీ ఇప్పుడు గంభీర్ మాత్రం ఏమీ మాట్లాడలేదు. ద్రవిడ్‌ను అనుసరించాలి కదా?’ అని ప్రశ్నించారు.

News March 26, 2025

ఈ మార్పులు కనిపిస్తే కళ్లజోడు మార్చాల్సిందే!

image

ఒకటే కళ్లజోడును ఎక్కువ రోజులు వాడొద్దని, ఏడాది లేదా రెండేళ్లకోసారి పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సంకేతాలేమైనా కనిపిస్తే కళ్లద్దాలను మార్చుకోవాలని చెబుతున్నారు.
1. డ్రైవింగ్‌లో సిగ్నల్స్ కనిపించకపోవడం, దగ్గరకు వెళ్లేవరకూ చదవలేకపోవడం 2. పుస్తకాలు చదవడం, మొబైల్‌ చూడటం కష్టంగా అనిపించడం 3. ఒకటి లేదా రెండు కళ్లల్లోని దృష్టిలో మార్పు కనబడటం వంటివి కనిపించినప్పుడు అద్దాలు మార్చాలి.

News March 26, 2025

ప్రజల కోసమే భూభారతి: పొంగులేటి

image

TG: ధరణి ఓ దుర్మార్గ చట్టమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. అందుకే భూభారతి చట్టం తీసుకొచ్చామని ఆయన అసెంబ్లీలో చెప్పారు. ‘ధరణి ఎజెండాతోనే మేం ఎన్నికలకు వెళ్లాం. ధరణి బాగుందా లేదా అని ఎన్నికల్లో ప్రజల తీర్పుతోనే స్పష్టమైంది. బీఆర్ఎస్ తప్పు చేసింది కాబట్టే ఓడించారు. భవిష్యత్‌లోనూ భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తాం. ఆ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతిస్తారో చూద్దాం’ అంటూ సవాల్ విసిరారు.

error: Content is protected !!