News March 3, 2025
ఇందిరమ్మ ఇళ్లు.. 15లోగా అకౌంట్లలోకి డబ్బులు

TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటోంది. తొలి విడతలో 71,482 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించగా దాదాపు 700 మంది నిర్మాణం ప్రారంభించారు. ఈ వారంలో మెజార్టీ లబ్ధిదారులు మొదలుపెట్టనున్నారు. బేస్మెంట్ పూర్తిచేసిన వారి అకౌంట్లలో ఈ నెల 15నాటికి రూ.లక్ష చొప్పున జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.715 కోట్లు సిద్ధం చేస్తోంది. వారికి దశలవారీగా రూ.5లక్షలు ఇవ్వనున్న విషయం <<15529635>>తెలిసిందే.<<>>
Similar News
News January 22, 2026
AI దెబ్బతో కార్లకు చిప్ల కొరత

AI డేటా సెంటర్లు భారీగా విస్తరిస్తుండటంతో ఈ ప్రభావం కార్ల పరిశ్రమకు కొత్త సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ఏఐ సర్వర్లకు భారీగా అవసరమయ్యే DRAM (Dynamic Random Access Memory) చిప్స్కు డిమాండ్ పెరగడంతో వాటి ధరలు 70-100% వరకు ఎగబాకాయి. చిప్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు డేటా సెంటర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. పరిస్థితి మారకపోతే కార్ల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News January 22, 2026
ఆస్ట్రేలియాలో మరోసారి కాల్పులు.. ముగ్గురు మృతి

ఆస్ట్రేలియాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూ సౌత్ వేల్స్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మరణించారు. గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిడ్నీకి సుమారు 611KM దూరంలో ఉన్న లేక్ కార్గెల్లిగోలో కాల్పులు జరిగాయి. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోయినేడాది DEC 14న బాండీ బీచ్లో ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో 10 కంటే ఎక్కువ మంది బలయ్యారు.
News January 22, 2026
అధిక స్క్రీన్ టైమ్తో పిల్లల హార్ట్కు రిస్క్

పిల్లలు ఫోన్లు, TVలకు గంటల తరబడి అతుక్కుపోవడం వల్ల వారి గుండె ఆరోగ్యం దెబ్బతింటోందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్లో పబ్లిష్ అయిన తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ప్రతి అదనపు గంట స్క్రీన్ టైమ్ BP, కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ను పెంచి గుండెకు ముప్పును తలపెడుతోంది. నిద్ర తక్కువైతే ఈ ప్రమాదం మరీ ఎక్కువ. మొబైల్ వాడకాన్ని తగ్గించి పిల్లలకు తగినంత నిద్ర, శారీరక శ్రమ ఉండేలా చూడాలని స్టడీ సూచించింది.


