News February 12, 2025
INDvsENG మ్యాచ్: అవయవదానానికి భారీ స్పందన
నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచులో భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. అయితే, పరుగులతో పాటు అవయవాలు దానం చేసేందుకు ప్రతిజ్ఞ చేసిన వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మ్యాచుకు ముందు అవయవదానానికి ప్రజలు ముందుకు రావాలని ఇరు జట్ల ప్లేయర్లు ఆకుపచ్చ బ్యాండ్లు ధరించి మైదానంలోకి వచ్చారు. దీనికి భారీ స్పందన లభించింది. ఇప్పటివరకు 15,754 మంది ప్రతిజ్ఞ చేశారు.
Similar News
News February 12, 2025
స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్?
TG: 42% బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చాకే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మార్చిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపుతామని భట్టి విక్రమార్క తెలిపారు. అయితే కేంద్రం ఆమోదం తెలుపుతుందా? లేదా? తెలిపినా ఇప్పట్లో తేలే వ్యవహారం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మార్చి తర్వాతే స్థానిక ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.
News February 12, 2025
‘దిల్రూబా’ విడుదల వాయిదా
కిరణ్ అబ్బవరం నటించిన ‘దిల్రూబా’ విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ మూవీ వాలంటైన్స్ డే సందర్భంగా FEB 14న రిలీజ్ కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని కిరణ్ తెలియజేస్తూ ‘కొంచెం లేట్గా వస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని చెప్పారు. కిరణ్ నటించిన ‘క’ హిట్ కావడంతో ఈ మూవీపైనా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
News February 12, 2025
పోలీసులకు పృథ్వీ ఫిర్యాదు
YCP సోషల్ మీడియా వింగ్ తనను వేధిస్తోందని HYD సైబర్క్రైమ్ పోలీసులకు నటుడు పృథ్వీ రాజ్ ఫిర్యాదు చేశారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తాను చేసిన <<15435022>>వ్యాఖ్యల <<>>తర్వాత ఫోన్లు, మెసేజ్లతో ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. తన ఫోన్ నంబర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, 1800 కాల్స్ చేయించారని వివరించారు. తనను వేధించిన వారిపై రూ.కోటి పరువునష్టం దావా వేస్తానని, AP హోంమంత్రికీ ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.