News February 6, 2025
INDvsENG: అత్యధిక విజయాలు మనవే

భారత్, ఇంగ్లండ్ మధ్య ఇప్పటివరకు 107 వన్డేలు జరిగాయి. వీటిలో టీమ్ ఇండియా 58 మ్యాచులు, ఇంగ్లండ్ 44 మ్యాచుల్లో విజయం సాధించింది. 2 మ్యాచ్లు టై అవ్వగా మరో 3 రద్దయ్యాయి. స్వదేశంలో 52 మ్యాచులు జరగగా భారత జట్టు 34 విజయాలు సాధించింది. ఇవాళ తొలి వన్డే జరిగే నాగ్పూర్ పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో తుది జట్టులోకి స్పిన్నర్ వరుణ్ను తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
Similar News
News March 22, 2025
చరణ్ బర్త్ డే.. ‘నాయక్’ రీరిలీజ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘నాయక్’ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గత కొన్నిరోజులుగా ‘నాయక్’ రీరిలీజ్పై అభిమానుల నుంచి డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చరణ్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ తెరకెక్కించారు. ఈ చిత్రం 2013లో రిలీజవగా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కాగా, ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు.
News March 22, 2025
విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం

AP: విశాఖ మేయర్ వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలుగా కూటమి నేతలు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దీంతో YCPకి షాక్ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. GVMCలో 98 స్థానాలుండగా, YCP 59 చోట్ల గెలిచింది. ఈ 9 నెలల్లో 28 మంది కూటమి పార్టీల్లో చేరడంతో YCP బలం పడిపోయింది. మేయర్కు నాలుగేళ్ల పదవీకాలం పూర్తవడంతో మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానానికి మార్గం సుగమమైంది.
News March 22, 2025
25 ఏళ్ల వరకూ డీలిమిటేషన్ ఉండొద్దు: స్టాలిన్

తమిళనాడు CM స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో డీలిమిటేషన్పై జరిగిన అఖిలపక్ష సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. అనంతరం స్టాలిన్ మాట్లాడారు. ‘25 ఏళ్ల వరకూ నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదని తీర్మానించాం. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తెలంగాణలో రెండో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. కొన్ని కారణాల వల్ల TMC హాజరు కాలేదు. జగన్ కూడా మా వెంటే ఉన్నట్లు భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.