News February 10, 2025

టర్మినేషన్‌ను సీక్రెట్‌గా ఉంచేందుకు బస్సుల్ని అడ్డంగా పెట్టిన ఇన్ఫీ: MC

image

ట్రైనీస్‌ను తొలగించేటప్పుడు <<15417347>>ఇన్ఫీ<<>> వ్యవహరించిన తీరును నెటిజన్లు విమర్శిస్తున్నారు. ‘ఆ రోజు క్యాంపస్‌లో Finacle ఎంప్లాయీస్, US క్లైంట్స్ ఉన్నారు. మమ్మల్ని టెర్మినేట్ చేయడం వాళ్లు చూడొద్దని బస్సులను అడ్డంగా పెట్టారు. ఆ వైపు వెళ్లకుండా షీల్డుగా ఎస్కార్టులను పెట్టారు. ఒక్కొక్కరినీ పిలిచి టెర్మినేట్ చేశారు. ఇది క్రూరత్వం. ట్రైనీస్ నిజం చెప్పేందుకు భయపడ్డారు’ అని ఒకరు చెప్పినట్టు మనీకంట్రోల్ తెలిపింది.

Similar News

News March 19, 2025

ఢిల్లీ వీధుల్లో న్యూజిలాండ్ ప్రధాని గల్లీ క్రికెట్

image

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఇండియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ వీధుల్లో అక్కడి పిల్లలతో క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు. ఆయనతో పాటు కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్‌ కూడా ఉన్నారు. ఇండియా, న్యూజిలాండ్‌ను ఏకం చేయడంలో క్రికెట్‌ను మించినది లేదని క్రిస్టోఫర్ ట్వీట్ చేశారు.

News March 19, 2025

2025-26 బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

image

TG: 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాసేపట్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు నల్లపోచమ్మ గుడిలో బడ్జెట్ ప్రతులను ఉంచి భట్టి ప్రత్యేక పూజలు చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలి సారి. కాగా బడ్జెట్ రూ.3లక్షల కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా.

News March 19, 2025

రికార్డు దిశగా గోల్డ్ ధరలు!

image

బంగారం ధరలు పెరుగుతుండటం చూస్తుంటే త్వరలోనే రూ.లక్షకు చేరేలా కనిపిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,900లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.90,440కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.1000 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,14,000గా ఉంది. శుభకార్యాల నేపథ్యంలో బంగారానికి భారీ డిమాండ్ నెలకొంది.

error: Content is protected !!