News April 10, 2024
కర్ణాటక పోలీసులకు ఇన్ఫోసిస్ భారీ విరాళం

కర్ణాటక పోలీసులకు ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ భారీ విరాళాన్ని అందించింది. సైబర్ క్రైమ్పై పోరాటానికి గాను రూ.33 కోట్లను బెంగళూరు పోలీసులకు ఇచ్చింది. సంస్థ సీఎస్ఆర్ విభాగం ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాక సీఐడీ, భారత సమాచార భద్రత మండలితో ఒప్పందాల్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. సైబర్ క్రైమ్ దర్యాప్తు కేంద్రంతో తమ అనుబంధాన్ని మరో నాలుగేళ్ల పాటు పొడిగించుకున్నట్లు వెల్లడించింది.
Similar News
News January 4, 2026
5 రోజులే పని చేస్తాం: బ్యాంక్ ఉద్యోగులు

బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజులు మాత్రమే పనిచేసేలా వెసులుబాటు కల్పించాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ‘ప్రపంచమంతా వారానికి 4 రోజుల పని విధానం వైపు అడుగులేస్తుంటే బ్యాంకు ఎంప్లాయిస్ 24×7 పనిచేస్తున్నారు. 5 రోజుల పని విధానానికి ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ ఒప్పుకుంది. దీనిని ప్రభుత్వం ఆమోదించాలి’ అని పేర్కొంది. కాగా Xలో 5DayBankingNow హ్యాష్ట్యాగ్ ట్రెండవుతోంది.
News January 4, 2026
సంక్రాంతి ఎఫెక్ట్.. ప్రైవేటు బస్సుల్లో ఛార్జీల మోత!

సంక్రాంతి సందడి మొదలవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు అమాంతం పెంచేస్తున్నాయి. సాధారణ రోజుల్లో HYD నుంచి విజయవాడకు బస్సు ఛార్జీ రూ.700గా ఉంటుంది. కానీ ప్రస్తుతం కొన్ని ఏజెన్సీలు ₹2,700 నుంచి ₹4,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ట్రైన్ రిజర్వేషన్లు దొరకకపోవడంతో ప్యాసింజర్స్ ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ట్రావెల్స్ వారు సీటును బట్టి ధరలు పెంచుతున్నట్లు తెలుస్తోంది.
News January 4, 2026
వరి మాగాణి మినుములో ఎండు తెగులు నివారణ

ఎండు తెగులు ఆశించిన మినుము మొక్కలు వడలి, ఎండి పంటకు నష్టం వాటిల్లుతుంది. భూమిలోని శిలీంధ్రం ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు పంట మార్పిడితో పాటు పొలంలో నీరు నిల్వలేకుండా చూడాలి. పైరు విత్తే ముందు kg విత్తనానికి 3గ్రా. కార్బెండజిమ్ పట్టించి విత్తాలి. ఎకరాకు 80kgల చివికిన పశువుల ఎరువు+20kgల వేపపిండిలో 2kgల ట్రైకోడెర్మావిరిడె జీవశిలీంధ్రాన్ని కలిపి విత్తే సమయంలో భూమిలో కలియదున్నుకోవాలి.


