News August 21, 2025

రూ.904 కోట్లతో అమరావతిలో మౌలిక వసతులు

image

AP: అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని క్యాబినెట్‌లో నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. కడప మైలవరంలో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు, అదానీ సోలార్ ఎనర్జీకి 200 ఎకరాల కేటాయింపుకు, ఏపీ యాచక నిరోధక చట్టసవరణ ముసాయిదా బిల్లుకు, తోట వెంకటాచలం(కాకినాడ) లిఫ్ట్ ఇరిగేషన్ కాల్వ అభివృద్ధి పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు.

Similar News

News March 12, 2026

కొత్త ఏడాది ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

image

ఈనెల 19న చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ‘శ్రీ పరాభవ నామ’ సంవత్సరంలో అన్ని రాశుల ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాల పంచాగాన్ని ‘భక్తి’ టీవీ విడుదల చేసింది. ముఖ్యంగా మిథున రాశివారికి ఆదాయం కంటే వ్యయం & రాజ్య పూజ్యం కంటే అవమానాలే ఎక్కువగా ఉంటాయని పండితులు తెలిపారు. సింహ రాశి వారికి అన్నీ సరిసమానంగా ఉంటాయని చెప్పారు. మీ రాశి ఏంటో కామెంట్ చేసి షేర్ చేయండి.

News March 12, 2026

ఫిరాయింపుల కేసు.. విచారణ ముగించిన సుప్రీంకోర్టు

image

TG: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో BRS పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగించింది. అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికే పిటిషన్లను పరిష్కరించారని న్యాయవాది సింఘ్వీ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు విచారణ ముగిసినట్లు జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ప్రకటించింది. 2 రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు ఇవ్వాలని ఆదేశించింది. కాగా స్పీకర్ ప్రసాద్ 10 మందికి MLAకు <<19352106>>క్లీన్‌చిట్<<>> ఇచ్చిన సంగతి తెలిసిందే.

News March 12, 2026

నిరుద్యోగులకు అలర్ట్.. ఏడాదికి 2 సార్లే..

image

TGPSC వన్‌టైం రిజిస్ట్రేషన్ (OTR) విధానంలో మార్పులు చేసింది. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే OTRలో మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రతి ఏడాది జనవరి, జూన్ నెలల్లో వారం నుంచి 10 రోజుల పాటు ఓటీఆర్ అప్‌డేట్ విండోను అందుబాటులో ఉంచుతారు. ఆ సమయంలో అదనపు విద్యార్హతలను, ఇతర మార్పులను నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే ఓటీఆర్‌లో అదనపు అర్హతలు నమోదు చేసుకోని వారు, ఈనెల 25లోగా చేసుకోవాలని కమిషన్ సూచించింది.