News March 26, 2025
త్వరలోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ: మంత్రి దుర్గేశ్

AP: గత ఏడాది జులైలో తూ.గోదావరి(D)లోని ఎర్రకాలువ ముంపుతో నష్టపోయిన రైతులకు మంత్రి కందుల దుర్గేశ్ శుభవార్త చెప్పారు. త్వరలోనే వారి అకౌంట్లలో ఇన్పుట్ సబ్సిడీ జమ చేస్తామని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో ఈ అంశం చర్చకు రాగా వెంటనే నిధులు విడుదల చేయాలని CM చంద్రబాబు ఆదేశించారని పేర్కొన్నారు. కాగా భారీ వర్షాలు, వరదల కారణంగా గోదావరి జిల్లాల్లోని 20 నియోజకవర్గాల్లో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.
Similar News
News April 24, 2025
ట్రంప్పై కోర్టుకెక్కిన 12 రాష్ట్రాలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై ఆ దేశానికి చెందిన 12 రాష్ట్రాల ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించాయి. ‘1977లో చేసిన చట్టం ప్రకారం టారిఫ్ను విధించేందుకు అత్యవసర చర్యలు తీసుకునే అధికారం అధ్యక్షుడికి లేదు. చట్టసభకు మాత్రమే ఆ అధికారముంది. ఇష్టారాజ్యంగా టారిఫ్లు విధించి అధ్యక్షుడు రాజ్యాంగాన్ని మీరారు. దేశ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలో పడేశారు’ అని తమ దావాలో ప్రభుత్వాలు ఆరోపించాయి.
News April 24, 2025
నేడు శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు విడుదల

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జులైకి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. గదుల కోటా బుకింగ్ మ.3 గంటలకు అందుబాటులో ఉంచనుంది. అలాగే మే నెలకు సంబంధించి పద్మావతి అమ్మవారి ఆలయం స్పెషల్ ఎంట్రీ దర్శన్ రూ.200 టికెట్లను కూడా రేపు ఉ. 10 గంటలకు రిలీజ్ చేయనుంది.
వెబ్సైట్: <
News April 24, 2025
ఉగ్రదాడిలో హస్తం లేకపోతే పాక్కు ఎందుకు ఉలికిపాటు?: మాజీ క్రికెటర్

పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ పాత్రపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశ్నించారు. ‘ఉగ్రదాడిలో నిజంగా పాకిస్థాన్ పాత్ర లేకపోయి ఉంటే ప్రధాని షెహబాజ్ ఇంకా ఎందుకు ఖండించలేదు? బలగాలెందుకు హై అలర్ట్లో ఉన్నాయి? ఎందుకంటే ఉగ్రవాదులకు నిలయంగా వారిని పెంచి పోషిస్తున్నామని పాక్కూ తెలుసు. సిగ్గు పడాలి’ అని ట్వీట్ చేశారు.