News April 13, 2025

కృష్ణా జలాల పంపిణీపై 15 నుంచి విచారణ

image

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రైబ్యునల్-2 ఈ నెల 15 నుంచి మరోసారి విచారణ జరపనుంది. 3 రోజుల పాటు జరిగే విచారణలో TG తరఫున ఇప్పటికే 2 దఫాలు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ మరో 2 లేదా 3 సార్లు వాదించనున్నారు. ఆ తర్వాత AP తరఫున వాదనలు ప్రారంభం అవుతాయి. ఈ ట్రైబ్యునల్ విచారణకు తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరు కానున్నారు.

Similar News

News January 16, 2026

నిర్మల్: మహిళా సంఘాలకు చెక్కు అందజేత

image

మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రూ.650 కోట్ల విలువ చేసే చెక్కు అందజేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ రుణాలు ఎంత దోహదం చేస్తాయన్నారు.

News January 16, 2026

APFIRST పేరుతో తిరుపతిలో రీసెర్చ్ సెంటర్

image

AP ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ(APFIRST) పేరిట తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు కానుంది. ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సమావేశంలో CM CBN దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ఏరో స్పేస్, డిఫెన్స్, స్పేస్, క్వాంటం, బయో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ కీలకం కానున్నాయి. ఈదిశగా పాలసీలు పెడుతున్నాం. IIT-IISER ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు కానుంది’ అని తెలిపారు.

News January 16, 2026

ప్రాధాన్యం సంతరించుకున్న మోదీ WB టూర్

image

PMమోదీ రేపు, ఎల్లుండి WBలో చేపట్టనున్న పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. APRలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ₹3,250CR ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఇతర రాష్ట్రాలకు 7 అమృత్ భారత్ రైళ్లను, తొలి వందే భారత్ స్లీపర్‌ ట్రైన్‌ను ప్రారంభిస్తారు. సింగూర్‌లో ₹830CR అభివృద్ధి పనులకు శ్రీకారం, బాలాగఢ్‌లో 900 ఎకరాల్లో కార్గో హ్యాండ్లింగ్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేస్తారు.