News August 27, 2024

పుణే హెలికాఫ్టర్ ప్రమాదంపై విచారణ: కేంద్ర మంత్రి రామ్మోహన్

image

AP: గత శనివారం పుణేలో హెలికాప్టర్ కుప్పకూలిన <<13948573>>ఘటనపై<<>> పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాతే ఆ ఘటనపై మాట్లాడతానని చెప్పారు. ఎయిర్ క్రాష్ ప్రమాదాలపై పౌర విమానయాన శాఖలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఉందని చెప్పారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ 16 ఏళ్ల నాటిదని, దానిని ఏపీ సీఎం చంద్రబాబు కోసం కేటాయించిందేనని తేలిన సంగతి తెలిసిందే.

Similar News

News January 15, 2026

నేటి నుంచి U-19 వన్డే వరల్డ్ కప్

image

జింబాబ్వేలో నేటి నుంచి ICC U-19 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జులవాయో వేదికగా ఇవాళ భారత జట్టు USAను ఢీకొట్టనుంది. ఇప్పటి వరకు 16 సార్లు టోర్నీ జరగ్గా IND 5 టైటిళ్లు గెలిచింది. ఆరోసారి కప్ సొంతం చేసుకోవాలని ఆయుష్ మాత్రే సారథ్యంలో బరిలోకి దిగుతోంది. ఇక 14ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి నిలిచింది. అటు ఇవాళ ఇతర మ్యాచుల్లో జింబాబ్వే-స్కాట్లాండ్, టాంజానియా-వెస్టిండీస్ పోటీ పడనున్నాయి.

News January 15, 2026

సేంద్రియ సాగుతోనే సక్సెస్

image

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్లో బంజరు భూమిని పదేళ్లకు లీజుకు ఉమేష్ వ్యవసాయం ప్రారంభించారు. రెండు ఎకరాల్లో ఒకవైపు సాగును కంటిన్యూ చేస్తూ భూమిని సారవంతం చేసుకున్నారు. కోడి ఎరువు, మేక ఎరువు, ఆవు పేడ ఎరువును కలిపి నేలను సారవంతంగా మార్చారు. మార్కెట్ స్టడీ చేసి ఓడీసీ-3 వెరైటీ మునగ మొక్కలను నాటారు. ఇవి అనుకున్నట్టుగానే 3-4 నెలల్లోనే కాపుకు వచ్చి, ఆరు నెలల్లో మంచి దిగుబడి వచ్చింది.

News January 15, 2026

ఏడాదికి రూ.40 లక్షలకు పైగా ఆదాయం

image

ప్రస్తుతం ఉమేష్ ఎకరానికి 10 టన్నుల తాజా మునగ ఆకులను సేకరిస్తున్నారు. ఆకులను షేడ్ నెట్ల కింద సహజంగా ఎండబెట్టి, దాదాపు 2.5 నుంచి 3 టన్నుల వరకు పొడిని సేకరిస్తారు. kg సగటున రూ.140 చొప్పున ఫార్మా కంపెనీలు, న్యూట్రాస్యూటికల్ కంపెనీలు, ఎరువుల కంపెనీలకు విక్రయిస్తున్నారు. డిమాండ్ బట్టి కొన్నిసార్లు రూ.500కు అమ్ముతారు. ఏడాదికి మునక్కాయలు, పొడి నుంచి 10 ఎకరాలకు రూ.40 లక్షల ఆదాయం పొందే స్థాయికి ఎదిగారు.