News December 9, 2024
హాస్టల్లో ఇంటర్ బాలిక ప్రసవం.. బిడ్డను విసిరేసిన వైనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733709639357_695-normal-WIFI.webp)
AP: ఏలూరులోని ఓ మిషనరీ సంస్థ హాస్టల్లో అమానవీయ ఘటన జరిగింది. ఓ ఇంటర్ బాలిక ఆడ బిడ్డను ప్రసవించింది. సహచరులు భయంతో నాలుగో అంతస్తు నుంచి ముళ్ల పొదల్లోకి శిశువును విసిరేయడంతో చనిపోయింది. ఈ దృశ్యాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బాలికను ఆస్పత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు. బాలిక గర్భం దాల్చడంలో నిర్వాహకుల ప్రమేయం ఉందా? అని ఆరా తీస్తున్నారు.
Similar News
News January 15, 2025
కేటీఆర్కు మరోసారి నోటీసులు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736927327004_893-normal-WIFI.webp)
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్, BLN రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో మరోసారి విచారణకు పిలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురిని ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు రేపు ఈడీ ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.
News January 15, 2025
‘డాకు మహారాజ్’ 10 లక్షల టికెట్స్ సోల్డ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736925815006_746-normal-WIFI.webp)
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా అదరగొడుతోంది. బుక్ మై షోలో ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 1 మిలియన్ టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బాక్సాఫీస్ దబిడి దిబిడి’ అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. నేటితో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి.
News January 15, 2025
BREAKING: చంద్రబాబుకు భారీ ఊరట
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736925290652_367-normal-WIFI.webp)
AP: సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ఈ కేసులో 2023 నవంబర్లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం SCని ఆశ్రయించింది.