News December 11, 2024
వచ్చే ఏడాదిపై సమంత ఆసక్తికర పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. వచ్చే ఏడాది తనకు ఎలా ఉంటుందో చెప్పే సందేశాన్ని పంచుకున్నారు. 2025లో చాలా బిజీగా ఉండటమే కాకుండా డబ్బులు ఎక్కువగా సంపాదిస్తారని అందులో ఉంది. ప్రేమను పంచే భాగస్వామిని పొందడంతో పాటు కొందరు పిల్లలు కూడా కలుగుతారని, మానసికంగానూ స్ట్రాంగ్గా ఉంటారని ఈ లిస్టులో ఉంది. దీంతో సమంత వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారని అభిమానుల్లో చర్చ జరుగుతోంది.
Similar News
News January 21, 2025
కల్లు గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు
AP: రాష్ట్రంలోని కల్లు, గీత కులవృత్తిదారులకు ప్రభుత్వం మద్యం దుకాణాలు కేటాయించింది. అన్ని జిల్లాలకు కలిపి మొత్తం 335 మద్యం షాపులు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రభుత్వం రాష్ట్రంలో 3,396 వైన్ షాపులకు లైసెన్సులు జారీ చేసింది. ఇందులో 10 శాతం దుకాణాలను గీత కులాలకు కేటాయించింది.
News January 21, 2025
పిల్లి చేసిన పనికి ఉద్యోగం పోయిందిగా..!
ఏంటి షాక్ అయ్యారా? చైనాకు చెందిన ఓ యువతికి ఇలాంటి విచిత్రమైన సంఘటనే ఎదురైంది. ఆ యువతి తన రాజీనామా లేఖను డ్రాఫ్ట్లో ఉంచింది. అయితే, ల్యాప్టాప్ను వదిలేసి వెళ్లగా అనుకోకుండా పెంపుడు పిల్లి కీబోర్డ్ ఎంటర్ బటన్ మీద దూకింది. దీంతో ఆ మెయిల్ యువతి బాస్కు చేరడంతో ఉద్యోగంతో పాటు ఇయర్ ఎండ్ బోనస్ను కోల్పోయింది. ఇదంతా సీసీటీవీలో రికార్డవగా, ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.
News January 21, 2025
నీరజ్ చోప్రాకు కట్నం ఎంత ఇచ్చారంటే..?
ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఇటీవల టెన్నిస్ ప్లేయర్ హిమానీ మోర్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కట్నంగా తన అత్తమామల నుంచి నీరజ్ ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు. అలాగే ఎలాంటి ఖరీదైన బహుమతులు, వస్తువులు, దుస్తులు కూడా ఆయన స్వీకరించలేదని హిమానీ తల్లిదండ్రులు తెలిపారు. దేవుడి దయ వల్ల తమ అమ్మాయికి దేశం మొత్తాన్ని గర్వింపజేసిన వ్యక్తితో పెళ్లి కావడం సంతోషంగా ఉందన్నారు.