News July 23, 2024
నెలకు రూ.5వేలు ఇస్తూ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్

దేశంలో కోటి మంది యువతకు లబ్ధి చేకూరేలా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. దేశంలోని టాప్ 500 కంపెనీల్లో నిరుద్యోగులకు ఇంటర్న్షిప్ ఇప్పించనుంది. 12 నెలల పాటు నెలకు రూ.5,000 ఇవ్వడంతో పాటు వన్టైమ్ అసిస్టెన్స్ కింద రూ.6,000 చెల్లిస్తుంది.
Similar News
News October 18, 2025
పిల్లల ప్రశ్నలను గౌరవించి రిప్లై ఇవ్వండి: వైద్యులు

పిల్లల సృజనాత్మకత పెరగాలంటే వారు ప్రశ్నలు అడగటాన్ని ప్రోత్సహించాలని మానసిక వైద్యుడు శ్రీకాంత్ సూచించారు. ‘ఐదేళ్ల లోపు చిన్నారులు రోజుకు సుమారు 300 ప్రశ్నలు అడుగుతారు. ఇది వారి అపారమైన ఉత్సుకతకు నిదర్శనం. తల్లిదండ్రులు వారి ప్రశ్నలకు ఓపిగ్గా జవాబివ్వడం, తెలియని వాటికి తెలుసుకొని చెప్తా అనడం చాలా ముఖ్యం. ప్రశ్నించడాన్ని అణచివేస్తే వారు స్వతంత్రంగా ఆలోచించే శక్తిని కోల్పోవచ్చు’ అని హెచ్చరించారు.
News October 18, 2025
CCRHలో 31 పోస్టులు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<
News October 18, 2025
బీసీ సంఘాల ‘రాష్ట్ర బంద్’.. నేతల వ్యాఖ్యలు

* బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కుట్రపూరితంగా స్టే తెచ్చారు. కోర్టులు మా మాట వినలేదు: R. కృష్ణయ్య
* రిజర్వేషన్లపై PM మోదీ వద్ద బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడట్లేదు: మహేశ్ కుమార్ గౌడ్
* బీసీ బిల్లు ఆగిపోవడానికి బీజేపీ నేతలే కారణం: మంత్రి కొండా సురేఖ
* కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ విధానమే తప్పు: మాజీ మంత్రి తలసాని
* బీసీల హక్కులను కాపాడేది బీజేపీ ప్రభుత్వమే: ఈటల