News September 30, 2024

దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబును దేవదాయశాఖ ఆహ్వానించింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. కాగా అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 20, 2026

అనంతపురం: ఉద్యోగుల వైద్య శిబిరానికి స్పందన

image

అనంతపురంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కాగా ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌తోపాటు కలెక్టరేట్, రెవెన్యూ, సర్వే ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

News January 20, 2026

ఫ్రెంచ్ వైన్‌పై 200% టారిఫ్‌లు వేస్తా.. మాక్రాన్‌పై ట్రంప్ ఫైర్

image

గాజా శాంతి కోసం ప్రతిపాదించిన ‘Board of Peace’లో చేరడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సుముఖంగా లేరన్న వార్తలపై ట్రంప్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. ‘ఆయన ఎలాగూ త్వరలో పదవి నుంచి తప్పుకొంటున్నారు. ఆయన అవసరం ఎవరికీ లేదు. కానీ పీస్ బోర్డులో చేరకపోతే ఫ్రెంచ్ వైన్, షాంపైన్‌లపై 200% టారిఫ్ వేస్తా. అప్పుడు ఆయనే దారిలోకి వస్తారు’ అంటూ బెదిరించారు. ట్రంప్ టారిఫ్‌ల అస్త్రం వాడటం పరిపాటిగా మారింది.

News January 20, 2026

TN గవర్నర్ వాకౌట్‌కు కారణాలివే: లోక్‌భవన్

image

TN అసెంబ్లీ నుంచి గవర్నర్ RN రవి వాకౌట్ చేయడానికి గల కారణాలను లోక్‌భవన్ వెల్లడించింది. ‘గవర్నర్ ప్రసంగిస్తుండగా పలుమార్లు మైక్రోఫోన్ ఆఫ్ చేశారు. ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించే స్టేట్‌మెంట్లు, ఆధారాలు లేని ఆరోపణలు ఉన్నాయి. నేరాల పెరుగుదల, 55% పెరిగిన POCSO కేసులు, 33% పెరిగిన లైంగిక వేధింపుల వంటి అనేక సమస్యలను ప్రసంగంలో ప్రస్తావించలేదు’ అని స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.