News March 22, 2024

IPL: CSKకు 250వ మ్యాచ్

image

IPL-2024 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. చెన్నైతో తొలి మ్యాచులో RCB టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నైకి ఇది 250వ IPL మ్యాచ్. ఎమ్మెస్ ధోనీ చెన్నై తొలి మ్యాచుతో పాటు 50, 100, 150, 200 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించారు. కానీ ఈసారి అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 250వ మ్యాచులో రుతురాజ్ గైక్వాడ్ జట్టును నడిపిస్తున్నారు.

Similar News

News October 17, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

*బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కంధపురి’ ఇవాళ ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది.
*ఈనెల 31న విడుదలయ్యే ‘బాహుబలి ది ఎపిక్’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి 3 గంటల 44 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేశారు.
*ఇవాళ ‘తెలుసు కదా’, ‘డ్యూడ్’ చిత్రాలు థియేటర్లలో విడుదలయ్యాయి. దేనికి వెళ్తున్నారు?

News October 17, 2025

విశాఖలో పెట్టుబడికి మరో సంస్థ ఆసక్తి

image

AP: నిర్మాణ సంస్థ కె.రహెజా విశాఖలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. IT సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాలు నిర్మించేందుకు ఆసక్తి చూపుతోంది. రూ.2,172కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నామని, మధురవాడలో 27 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 9,681మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ఇటీవల విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

News October 17, 2025

అజిత్రోమైసిన్ సిరప్‌లో పురుగులు

image

మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు మరణాల తర్వాత అజిత్రోమైసిన్ సిరప్‌లో పురుగులు రావడం కలకలం రేపుతోంది. గ్వాలియర్ జిల్లా మోరార్ ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చిన అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ సిరప్‌లో పురుగులున్నాయని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలోని మిగిలిన 306 బాటిల్స్‌ను సీజ్ చేసి, టెస్ట్ కోసం శాంపిల్స్ భోపాల్ పంపారు. అది జనరిక్ మెడిసిన్ అని, MPలోని ఓ కంపెనీ తయారు చేస్తోందని అధికారులు వెల్లడించారు.