News March 22, 2024

IPL: CSKకు 250వ మ్యాచ్

image

IPL-2024 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. చెన్నైతో తొలి మ్యాచులో RCB టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నైకి ఇది 250వ IPL మ్యాచ్. ఎమ్మెస్ ధోనీ చెన్నై తొలి మ్యాచుతో పాటు 50, 100, 150, 200 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించారు. కానీ ఈసారి అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 250వ మ్యాచులో రుతురాజ్ గైక్వాడ్ జట్టును నడిపిస్తున్నారు.

Similar News

News April 24, 2025

ఉగ్రదాడిలో హస్తం లేకపోతే పాక్‌కు ఎందుకు ఉలికిపాటు?: మాజీ క్రికెటర్

image

పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ పాత్రపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశ్నించారు. ‘ఉగ్రదాడిలో నిజంగా పాకిస్థాన్‌ పాత్ర లేకపోయి ఉంటే ప్రధాని షెహబాజ్ ఇంకా ఎందుకు ఖండించలేదు? బలగాలెందుకు హై అలర్ట్‌లో ఉన్నాయి? ఎందుకంటే ఉగ్రవాదులకు నిలయంగా వారిని పెంచి పోషిస్తున్నామని పాక్‌కూ తెలుసు. సిగ్గు పడాలి’ అని ట్వీట్ చేశారు.

News April 24, 2025

9 ఏళ్ల తర్వాత వరుస హాఫ్ సెంచరీలు

image

ఈ ఐపీఎల్ తొలి నాలుగైదు మ్యాచ్‌లలో విఫలమైన రోహిత్ శర్మ ట్రాక్‌లోకి వచ్చారు. ఈ నెల 20న CSKపై 76*, నిన్న SRHపై 70 రన్స్ చేశారు. ఇలా వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేయడం 9 ఏళ్లలో తొలిసారి. చివరిసారిగా 2016లో 62, 65, 68*, 85* రన్స్ చేశారు. అంతకుముందు 2008లో 76*, 57, 2010లో 51, 68*, 2011లో 87, 56*, 2013లో 74*, 62* బ్యాక్ టు బ్యాక్ అర్ధ శతకాలు బాదారు.

News April 24, 2025

టెన్త్ ఫెయిలైన వారికి ALERT

image

AP: టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు ఫీజు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1,000గా ఉంది. https://www.bse.ap.gov.in/ సైట్‌లో HM లాగిన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.

error: Content is protected !!