News May 11, 2024
IPL.. DC జట్టుకు బిగ్ షాక్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్పై ఒక మ్యాచ్కి సస్పెన్షన్ వేటు పడింది. RRతో మ్యాచ్ సందర్భంగా స్లో ఓవర్ రేటు(గతంలో 2 సార్లు ఫైన్ వేశారు) కారణంగా అతనిపై ఈ నిషేధంతో పాటు బీసీసీఐ రూ.30 లక్షల ఫైన్ వేసింది. దీంతో రేపు RCBతో జరగాల్సిన మ్యాచ్కు అతను దూరం కానున్నారు. కీలకమైన ప్లే ఆఫ్స్కు ముందు DCకి ఇది బిగ్ షాక్గా చెప్పుకోవచ్చు. పాయింట్ల టేబుల్లో DC ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది.
Similar News
News March 19, 2026
BREAKING: జాబ్ క్యాలెండర్ విడుదల

AP: 10,060 పోస్టులతో మంత్రి లోకేశ్ <<19422647>>జాబ్ క్యాలెండర్<<>> విడుదల చేశారు. ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నామని తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. ఉద్యోగార్థులందరూ ‘<
News March 19, 2026
16.7L మె.టన్నుల క్రూడ్ నిలిచిపోయింది: కేంద్రం

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారతీయ జెండా ఉన్న 22 నౌకలు పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లో చిక్కుకుపోయాయని నౌకాయాన మంత్రిత్వ శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేశ్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఇందులో 16.7L మె.టన్నుల క్రూడాయిల్, 3.2L మె.టన్నుల LPG, 2L మె.టన్నుల LNG ఉన్నాయని తెలిపారు. ఈ నౌకల్లోని 611 మంది ఇండియన్ నావికులు సురక్షితంగా ఉన్నారన్నారు. అన్ని దేశాలకు చెందిన దాదాపు 500 నౌకలు ఆగిపోయాయని పేర్కొన్నారు.
News March 19, 2026
విద్యార్థుల చేతిరాతపై ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు!

AP: విద్యార్థుల చేతిరాత బాగాలేదనే కారణంతో మార్కులు తగ్గించవద్దని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. సమాధానాల ఆధారంగానే మూల్యాంకనం చేయాలని జూ.లెక్చరర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ‘పూర్తిగా చదవకుండానే మార్కులు ఇవ్వొద్దు. ఆన్సర్స్ సరిగ్గా ఉంటే చేతిరాత కారణంగా మార్కులు తగ్గించవద్దు’ అని సూచించింది. పొరపాట్లు వస్తే ₹3వేలు-7500 వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించింది. ఈ నెల 21 నుంచి మూల్యాంకనం మొదలు కానుంది.


