News November 7, 2024

IPL: రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌లో మనోళ్లు వీరే

image

IPL మెగా వేలంలో ఈసారి భారత్ నుంచి 23 మంది ఆటగాళ్లు రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో బరిలోకి దిగుతున్నారు. వీరిలో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అశ్విన్, చాహల్, వెంకటేశ్ అయ్యర్, ఇషాన్ కిషన్, పడిక్కల్, కృనాల్ పాండ్య, షమీ, సిరాజ్, అర్ష్‌దీప్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, అవేశ్ ఖాన్, ముకేశ్, ప్రసిద్ధ్ కృష్ణ, నటరాజన్, హర్షల్ పటేల్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ ఉన్నారు.

Similar News

News February 18, 2026

టెన్త్ పరీక్షల గ్యాప్‌లోనూ క్లాసులు!

image

TG: టెన్త్ పరీక్షల మధ్య గ్యాప్‌లో విద్యార్థులకు క్లాసులు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఎగ్జామ్స్ మధ్య 3-5 రోజుల వ్యవధి ఉండటంతో సూడెంట్లు స్కూలుకు రావాలని ఆదేశించారు. ఆయా రోజుల్లో 3 పీరియడ్ల చొప్పున క్లాసులు తీసుకోనున్నారు. మార్చి 14 నుంచి పరీక్షలు జరగనుండగా, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎక్కువ గ్యాప్ ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ఆ గ్యాప్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.

News February 18, 2026

ప్రమాదానికి ఏడాది.. మళ్లీ పనులు మొదలు

image

TG: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) తవ్వకం మళ్లీ మొదలైంది. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేపట్టారు. గతేడాది ఫిబ్రవరిలో టీబీఎం మెషీన్‌తో తవ్వకాలు జరుపుతుండగా టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. దీంతో మెషీన్ తవ్వకాలు నిలిపివేసి బ్లాస్టింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించి పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.

News February 18, 2026

ప్రకృతి వ్యవసాయంలో APCNF కీలక పాత్ర

image

రైతులను రసాయన రహిత వ్యవసాయంవైపు నడిపించాలనే ఉద్దేశంతో 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం APCNF(Andhra Pradesh Community Managed Natural Farming) ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని కింద సన్నకారు రైతులు రసాయన సేద్యం కాకుండా సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా రైతు సాధికార సంస్థ కృషి చేస్తోంది. రాష్ట్రంలో వేలాది మంది రైతులు లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తూ మానవ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు.