News April 12, 2025

IPL: రిషభ్ పంత్ మళ్లీ విఫలం

image

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషభ్ పంత్ మళ్లీ విఫలమయ్యారు. ఈసారి ఓపెనింగ్‌ స్థానంలో వచ్చినా ఆయన ఆట మారలేదు. GTతో జరుగుతున్న మ్యాచులో పంత్ 18 బంతులాడి 21 పరుగులే చేశారు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచుల్లో 0, 15, 2, 2, DNB, 21తో తీవ్రంగా నిరాశపరిచారు. ఈ సీజన్‌లో ఆయన స్థాయికి తగ్గట్లు ఒక్క మ్యాచులో కూడా రాణించలేదు. కనీసం నెక్ట్స్ మ్యాచులోనైనా బ్యాట్ ఝుళిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Similar News

News November 22, 2025

మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

image

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.

News November 22, 2025

సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము

image

AP: విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని పేర్కొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని తెలిపారు. ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, ఆయన సందేశంతో అనేక మందిని సేవామార్గంలో నడిపించారన్నారు.

News November 22, 2025

తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం

image

ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 205 రన్స్ టార్గెట్‌ను ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ENG బౌలర్లను ఓపెనర్ హెడ్ ఊచకోత కోశారు. కేవలం 83 బంతుల్లోనే 123 రన్స్ బాదారు. లబుషేన్ 51* రన్స్‌తో రాణించారు.
స్కోర్స్: ENG- 172, 164.. AUS- 132, 205/2