News April 12, 2025

IPL: రిషభ్ పంత్ మళ్లీ విఫలం

image

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషభ్ పంత్ మళ్లీ విఫలమయ్యారు. ఈసారి ఓపెనింగ్‌ స్థానంలో వచ్చినా ఆయన ఆట మారలేదు. GTతో జరుగుతున్న మ్యాచులో పంత్ 18 బంతులాడి 21 పరుగులే చేశారు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచుల్లో 0, 15, 2, 2, DNB, 21తో తీవ్రంగా నిరాశపరిచారు. ఈ సీజన్‌లో ఆయన స్థాయికి తగ్గట్లు ఒక్క మ్యాచులో కూడా రాణించలేదు. కనీసం నెక్ట్స్ మ్యాచులోనైనా బ్యాట్ ఝుళిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Similar News

News October 20, 2025

మేకప్ తీయడానికి ఈ జాగ్రత్తలు

image

మేకప్ వేసుకోవడంలోనే కాదు దాన్ని తీసే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. లేదంటే ముఖ చర్మం దెబ్బతింటుంది. మేకప్ తీసేటపుడు ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. కాటన్ ప్యాడ్‌పై మేకప్ రిమూవర్ వేసి ముఖానికి అద్ది కాసేపటి తర్వాత క్లీన్ చెయ్యాలి. కళ్ల చివర్లు, పెదాలు, మెడ, చెవులు, హెయిర్‌లైన్‌ ప్రాంతాల్లోనూ మేకప్ తియ్యాలి. కుదిరితే ముఖానికి ఆవిరి పట్టి ఫేస్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.

News October 20, 2025

2023లో ఎంతమంది పుట్టారంటే?

image

దేశవ్యాప్తంగా 2023 JAN 1 నుంచి DEC 31 వరకు జిల్లాల వారీగా నమోదైన జనన, మరణాలపై సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(CRS) నివేదికను కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసింది. APలో 7,62,093 జననాలు, 4,42,218 మరణాలు, TGలో 6,52,688 జననాలు, 2,40,058 మరణాలు నమోదయ్యాయి. జననాల్లో APలో కర్నూలు, కడప, అనంతపురం, TGలో HYD, NZB, కామారెడ్డి తొలి 3 స్థానాల్లో నిలిచాయి. 2 రాష్ట్రాల్లో ఏ జిల్లాలోనూ లక్షకుపైగా జననాలు నమోదు కాలేదు.

News October 20, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

దీపావళి వేళ బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి ₹1,30,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 పతనమై రూ.1,198,00గా ఉంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి ధర రూ.1,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.