News April 5, 2025

IPL: ఉత్కంఠపోరులో గెలుపెవరిదంటే..

image

ముంబైతో జరిగిన ఉత్కంఠ పోరులో LSG విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో నమన్ ధీర్(24 బంతుల్లో 46), సూర్యకుమార్(43 బంతుల్లో 67) పోరాడినా ఫలితం లేకపోయింది. LSG బౌలర్లలో శార్దూల్, ఆకాశ్, ఆవేశ్, దిగ్వేశ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

Similar News

News February 1, 2026

భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాక్

image

రానున్న టీ20 వరల్డ్ కప్‌ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్-పాక్ తలపడాల్సి ఉంది.

News February 1, 2026

గుడి మాఢవీధుల పక్కనే ఇల్లు ఉండవచ్చా?

image

దేవాలయానికి అతి సమీపంలో నివాస గృహాలు ఉండటం అంత శ్రేయస్కరం కాదంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. ‘మాడవీధి దాటి ఇల్లు ఉండాలి. ఇంట్లో నిత్యం జరిగే జనన, మరణాల వంటి అశౌచాలు లేదా ఇతర లౌకిక కార్యకలాపాల వల్ల కలిగే ప్రతికూల ప్రభావం దేవాలయ పవిత్రతకు భంగం కలిగించవచ్చు. అందుకే ఆధ్యాత్మిక శక్తికి, మానవ జీవనానికి మధ్య మాడవీధి ఓ రక్షణ సరిహద్దుగా ఉంటూ, దోషాలు తగలకుండా కాపాడుతుంది’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 1, 2026

ఆస్ట్రేలియాతో సిరీస్.. క్లీన్‌స్వీప్ చేసిన పాక్

image

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లోనూ పాకిస్థాన్ 111 పరుగుల తేడాతో విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 96 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను పాక్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన పాక్ ప్లేయర్ బాబర్.. T20Iలలో అత్యధిక అర్ధ శతకాలు(39) చేసిన ఆటగాడిగా నిలిచారు. ఈ క్రమంలో కోహ్లీ(38) రికార్డును బద్దలుకొట్టారు.