News October 4, 2024
ఇరాన్vsఇజ్రాయెల్: ఎవరి బలం ఎంతంటే..
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సైనిక బలాబలాల గురించి చూస్తే..
క్రియాశీల బలగాలు: ఇరాన్-6,10,000మంది, ఇజ్రాయెల్- 1,70,000మంది
రిజ్వర్వు బలగాలు: ఇరాన్-3,50,000, ఇజ్రాయెల్-4,65,000
రక్షణ బడ్జెట్: ఇరాన్-9.9 బిలియన్ డాలర్లు, ఇజ్రాయెల్-24.4 బిలియన్ డాలర్లు
ఫైటర్ జెట్లు: ఇరాన్-186, ఇజ్రాయెల్-241
హెలికాప్టర్లు, ట్యాంకులు: ఇరాన్-129, 2000, ఇజ్రాయెల్-146, 1300
సబ్మెరైన్లు: ఇరాన్-19, ఇజ్రాయెల్-5
Similar News
News October 7, 2024
సింగరేణి లాభాలు.. అత్యధికం ఎవరికంటే?
TG: సింగరేణి లాభాల వాటాలో అత్యధికంగా మంచిర్యాల(D) శ్రీరాంపూర్ SRP-1 ఎస్డీఎల్ ఆపరేటర్ ఆసం శ్రీనివాస్ రూ.3.24 లక్షలు పొందారని AITUC అధ్యక్షుడు సీతారామయ్య వెల్లడించారు. ఆ తర్వాత మందమర్రి KK-5లో చేసే జనరల్ మజ్దూర్ రాజు రూ.3.1 లక్షలు, శ్రీరాంపూర్ ఆర్కే-5కు చెందిన SDL ఆపరేటర్ ఆటికం శ్రీనివాస్ రూ.3.01 లక్షల లాభాల వాటా పొందారని తెలిపారు. వీరికి ఇవాళ C&MD కార్యాలయంలో చెక్కులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
News October 7, 2024
22, 23 తేదీల్లో విజయవాడలో డ్రోన్ సమ్మిట్
AP: విజయవాడలో ఈ నెల 22, 23 తేదీల్లో అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ జరగనుంది. డ్రోన్ల తయారీ సంస్థలు, ఐఐటీలు, ఐఐఎస్సీల నుంచి దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 22న కృష్ణా తీరంలో 5వేల డ్రోన్లతో భారీ ప్రదర్శన జరుగుతుంది. సదస్సులో సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారు. విస్తృతమైన ప్రజా వినియోగానికి వీలుగా డ్రోన్లను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
News October 7, 2024
కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హార్దిక్
టీ20ల్లో అత్యధిక మ్యాచులను సిక్సర్లతో ముగించిన భారత ప్లేయర్గా హార్దిక్ పాండ్య నిలిచారు. బంగ్లాతో మ్యాచులో కోహ్లీ(4 మ్యాచులు) రికార్డును అధిగమించారు. ఆ తర్వాతి స్థానాల్లో ధోనీ, పంత్ మూడేసి మ్యాచులతో ఉన్నారు. కాగా బంగ్లాదేశ్ జరిగిన T20 మ్యాచులో హార్దిక్ 39 పరుగులు చేయగా అందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదారు.