News March 8, 2025
IPLకు పాకిస్థాన్ ప్లేయర్ ఆమిర్?

IPL 2026 వేలంలో తన పేరు నమోదు చేసుకుంటానని పాకిస్థాన్ స్టార్ బౌలర్ మహ్మద్ ఆమిర్ తెలిపారు. వేలంలో ఎంపికైతే తన బెస్ట్ ఇస్తానని చెప్పారు. ECB తరఫున వేలంలో రిజిస్టర్ చేసుకుంటానని వెల్లడించారు. కాగా ఆమిర్ భార్య నర్జిస్ బ్రిటిష్ పౌరురాలు. అతడికి కూడా ఆ దేశ పౌరసత్వం వచ్చింది. దీంతో ECB తరఫున ఆయన వేలంలో పేరు నమోదు చేసుకోవచ్చు. కాగా IPLలో పాకిస్థాన్ ప్లేయర్లపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News March 19, 2025
కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం

TG బడ్జెట్లో ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ‘ఇందిర గిరి జల వికాసం’ పేరుతో నూతన స్కీమును అమలు చేయనున్నట్లు తెలిపింది. పోడుభూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు సౌర ఆధారిత పంపుసెట్ల ద్వారా సాగునీటి సరఫరా చేయనుంది. పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులు, తోటల పెంపకానికి ప్రోత్సాహం అందివ్వనుంది. 2.1 లక్షల రైతులకు ఈ సౌకర్యం కల్పించనుంది. నాలుగేళ్లలో గిరిజనుల అభివృద్ధికి రూ.12,600 కేటాయిస్తామని పేర్కొంది.
News March 19, 2025
ముంబై ఫస్ట్ మ్యాచ్.. కెప్టెన్గా సూర్య

IPL-2025: ముంబై ఈ సీజన్లో ఆడే తొలి మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయనున్నారు. ఈ విషయాన్ని కెప్టెన్ హార్దిక్ పాండ్య వెల్లడించారు. గత సీజన్లో చివరి మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యపై నిషేధం పడింది. దీంతో ఆ స్టార్ ఆల్రౌండర్ మార్చి 23న చెన్నైతో జరిగే తొలి మ్యాచుకు అందుబాటులో ఉండరు.
News March 19, 2025
పాత ఫోన్.. గంటకు పైగా ఛార్జ్ చేస్తే పేలే ప్రమాదం

పాత ఫోన్లు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలోని చెడిపోయిన బ్యాటరీ స్థానంలో క్వాలిటీ లేని చైనా బ్యాటరీని అమర్చుతారని చెబుతున్నారు. అలాంటి బ్యాటరీని గంటకు పైగా ఛార్జ్ చేస్తే వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఫోన్ను ఎక్కువ సేపు ప్లగ్ ఇన్ చేసి ఉంచకూడదంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజ్గఢ్ జిల్లాలో సెకండ్ హ్యాండ్ మొబైల్ పేలి ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.