News March 30, 2024
అనంతపురం జిల్లా సిద్ధమా..?: CM జగన్

AP: సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. తాజాగా ‘అనంతపురం జిల్లా సిద్ధమా..?’ అంటూ జగన్ వైసీపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. నిన్న కర్నూలు జిల్లా కోడుమూరు, ఎమ్మిగనూరు, వేముగోడు, ఆదోని మీదుగా 108 కి.మీ. యాత్ర చేపట్టారు. నేడు పత్తికొండ, గుంతకల్, శింగనమల, ధర్మవరం నియోజకవర్గాల్లో రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
Similar News
News April 18, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

✮జలం-జీవంపై దృష్టి సారించాలి: కలెక్టర్
✮మెళియాపుట్టి: రోగులకు మెరుగైన సేవలందించాలి -ఐటీడీఏ పీఓ
✮శ్రీకాకుళం జిల్లాలో ఓటర్లు ఎంతమంది అంటే?
✮గ్రామ స్థాయిలో వైసీపీ బలోపేతమవ్వాలి: మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి
✮టెక్కలి: బంగారం దుకాణాల్లో చోరీ.. దొంగ అరెస్ట్
✮సోంపేటలో ఈనెల 20న జాబ్ మేళా
✮ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే బగ్గు వినతుల స్వీకరణ
News April 18, 2026
‘వారణాసి’పై ఎండల ఎఫెక్ట్!

మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘వారణాసి’ కీలక షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ నేతృత్వంలో మహేశ్పై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే మూవీ యూనిట్ మే నెలలో సమ్మర్ బ్రేక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహేశ్, జక్కన్న తమ ఫ్యామిలీలతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారట. ఆ తర్వాత జూన్ నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు సమాచారం.
News April 17, 2026
LNG ఇంపోర్ట్స్.. భారత్కు ఇక బోలెడన్ని ప్రత్యామ్నాయాలు!

LNG కోసం ఇప్పటివరకు ఎక్కువగా ఖతర్పైన ఆధారపడిన భారత్ పశ్చిమాసియా యుద్ధ పరిణామాలతో కొత్త సోర్సులను కనెక్ట్ చేసుకుంది. ఏడేళ్ల గ్యాప్ తర్వాత నార్వే నుంచి, రెండేళ్ల విరామం తర్వాత రష్యా నుంచి భారత్కు త్వరలో LNG కార్గోలు రానున్నట్లు సమాచారం. ఇక ఆఫ్రికా దేశాల నుంచి 1.2 మిలియన్ టన్నుల LNGకి భారత్ ఆర్డర్ చేసింది. ఇందులో ఆరు నౌకలు గత నెల భారత్ చేరుకోగా మరో 7,54,000 టన్నుల LNG ఈనెలాఖరుకు రానుంది.


