News March 30, 2024
అనంతపురం జిల్లా సిద్ధమా..?: CM జగన్
AP: సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. తాజాగా ‘అనంతపురం జిల్లా సిద్ధమా..?’ అంటూ జగన్ వైసీపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. నిన్న కర్నూలు జిల్లా కోడుమూరు, ఎమ్మిగనూరు, వేముగోడు, ఆదోని మీదుగా 108 కి.మీ. యాత్ర చేపట్టారు. నేడు పత్తికొండ, గుంతకల్, శింగనమల, ధర్మవరం నియోజకవర్గాల్లో రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
Similar News
News January 15, 2025
హీరో పేరిట మోసం.. ₹7కోట్లు పోగొట్టుకున్న మహిళ!
తాను హాలీవుడ్ యాక్టర్ బ్రాడ్ పిట్నంటూ ఓ స్కామర్ ఫ్రెంచ్ మహిళ(53)ను మోసం చేశాడు. ఆన్లైన్ పరిచయం పెంచుకొని AI ఫొటోలు పంపి ఆమెను నమ్మించాడు. 2023 నుంచి రిలేషన్షిప్లో ఉన్నాడు. ఏంజెలినా జూలీతో డివోర్స్ వివాదం వల్ల క్యాన్సర్ చికిత్సకు సొంత డబ్బుల్ని వాడుకోలేకపోతున్నానని, మహిళ నుంచి ₹7cr రాబట్టాడు. తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ డిప్రెషన్తో ఆస్పత్రి పాలయింది. అధికారులకు ఫిర్యాదు చేసింది.
News January 15, 2025
Stock Markets: మెటల్, PSU బ్యాంకు షేర్లకు గిరాకీ
మోస్తరు లాభాల్లో మొదలైన బెంచ్మార్క్ సూచీలు ప్రస్తుతం రేంజుబౌండ్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,202 (+25), సెన్సెక్స్ 76,649 (+150) వద్ద ట్రేడవుతున్నాయి. సెక్టోరల్ ఇండైసెస్ మిశ్రమంగా ఉన్నాయి. మెటల్, PSU BANK, ఆటో, O&G షేర్లకు డిమాండ్ ఉంది. FMCG, ఫార్మా, హెల్త్కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి. NTPC, మారుతీ, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ADANI SEZ టాప్ గెయినర్స్. BAJAJ TWINS టాప్ లూజర్స్.
News January 15, 2025
అరవింద్ కేజ్రీవాల్కు ముప్పు: ఇంటెలిజెన్స్ సోర్సెస్
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులను అలర్ట్ చేసినట్టు సమాచారం. ఖలిస్థానీ వేర్పాటువాదుల నుంచి ఆయనకు ముప్పు ఉందని చెప్పినట్టు తెలిసింది. ఈ విషయాన్ని అటు ఆప్, ఇటు కేంద్రం అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం కేజ్రీవాల్కు Z-కేటగిరీ సెక్యూరిటీ ఉంది. నేడు హనుమాన్ మందిరంలో పూజలు చేశాక ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు.