News January 9, 2025
ఉచితాలా? సౌకర్యాలా? ఏవి కావాలో తేల్చుకోండి: అరవింద్

ఉచిత పథకాలపై 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ అరవింద్ పనగఢియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు కావాలో? మంచి రోడ్లు, మంచినీటి సరఫరా తదితర సౌకర్యాలు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. మౌలిక సదుపాయాలకు కేటాయించిన నిధులను రాష్ట్రాలు ఉచితాలకు పంచుతున్నాయనే ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘ప్రాజెక్టులకు డబ్బులిస్తే వాటికే ఖర్చుచేయాలి. అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే తుది నిర్ణయం’ అని పేర్కొన్నారు.
Similar News
News November 26, 2025
BREAKING: భారత్ ఘోర ఓటమి

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులోనూ భారత్ ఘోర ఓటమిపాలైంది. ఐదో రోజు రెండో ఇన్నింగ్సులో 140 స్కోరుకే ఆలౌటైంది. జడేజా(54) మినహా అందరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. సైమన్ 6, కేశవ్ 2, ముత్తుసామి, మార్కో చెరో వికెట్ తీశారు. దీంతో సఫారీలు 408 రన్స్ తేడాతో విజయం సాధించి 2-0 తేడాతో సిరీస్ను క్లీన్స్వీప్ చేశారు.
స్కోర్లు: SA.. 489/10, 260/5(డిక్లేర్డ్), IND.. 201/10, 140/10
News November 26, 2025
2033 నాటికి 150 లక్షల టన్నుల పాల ఉత్పత్తి లక్ష్యం

AP: పాల ఉత్పత్తిలో ప్రస్తుతం దేశంలో ఏడో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 2033 నాటికి తొలి 3 స్థానాల్లో నిలిపేందుకు కృషి చేస్తున్నామని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదరనాయుడు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 139.46 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోందని.. 2033 నాటికి దీన్ని 150 లక్షల టన్నులకు పెంచడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.
News November 26, 2025
దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజ్యాంగమే మార్గదర్శి: రాష్ట్రపతి

భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆమె మాట్లాడారు. ‘దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజ్యాంగమే మార్గదర్శి. 25Cr మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం అతిపెద్ద ఘనత. ఆర్థిక ఏకీకరణలో భాగంగా GST తీసుకొచ్చాం. మహిళా సాధికారిత కోసం ట్రిపుల్ తలాక్ తీసేశాం. Art370ని రద్దు చేశాం’ అని చెప్పారు.


