News January 9, 2025
ఉచితాలా? సౌకర్యాలా? ఏవి కావాలో తేల్చుకోండి: అరవింద్
ఉచిత పథకాలపై 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ అరవింద్ పనగఢియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు కావాలో? మంచి రోడ్లు, మంచినీటి సరఫరా తదితర సౌకర్యాలు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. మౌలిక సదుపాయాలకు కేటాయించిన నిధులను రాష్ట్రాలు ఉచితాలకు పంచుతున్నాయనే ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘ప్రాజెక్టులకు డబ్బులిస్తే వాటికే ఖర్చుచేయాలి. అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే తుది నిర్ణయం’ అని పేర్కొన్నారు.
Similar News
News January 20, 2025
కాళేశ్వరం విచారణ.. నేడు KCRకు నోటీసులు?
TG: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ చివరి దశకు చేరింది. రేపటి నుంచి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించనుంది. మాజీ CM కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్(మాజీ ఆర్థిక మంత్రి)ను విచారణకు పిలిచే అవకాశముంది. ఇవాళ ఈ నేతలకు సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కమిషన్ నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, రిటైర్డ్ ఇంజినీర్లతో పాటు ఇతర అధికారులను ప్రశ్నించింది.
News January 20, 2025
విశ్వవిజేతలుగా భారత్: తెలుగోడి కీలక పాత్ర
ఖో ఖో WCలో భారత మహిళల జట్టు విజయంలో తెలుగు వ్యక్తి ఇస్లావత్ నరేశ్ పాత్ర ఉంది. TGలోని పెద్దపల్లి(D) ధర్మారంలోని బంజరపల్లికి చెందిన నరేశ్ జట్టుకు సహాయ కోచ్గా ఉన్నారు. 1995లో క్రీడాకారుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన 2015లో కోచ్గా మారారు. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాగా అంచెలంచెలుగా జాతీయ జట్టుకు సహాయ కోచ్గా ఎదిగారు. స్కిల్ అనలైజర్గా ఆటగాళ్ల తప్పులు, బలహీనతలను సరిచేయడంలో ఆయనదే ముఖ్య పాత్ర.
News January 20, 2025
ALERT.. రేపు, ఎల్లుండి జాగ్రత్త
TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. రానున్న రెండ్రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.