News April 25, 2024
అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం గొప్పా?: బాబు

AP: అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం పెద్ద గొప్పా? అని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అసమర్థ ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ ఇబ్బందులే. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్. ఏమీ చేయకుండా ప్రజలకు కథలు చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలి. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయండి’ అని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News February 21, 2026
AIIMS బీబీనగర్లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని <
News February 21, 2026
ఉగ్రదాడికి ప్లాన్.. ఢిల్లీలో హైఅలర్ట్

దేశ రాజధాని ఢిల్లీలో పాక్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఎర్రకోట సమీపంలోని ఆలయాలే లక్ష్యంగా ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడొచ్చని ఇంటెలిజెన్స్ గుర్తించింది. దీంతో రెడ్ ఫోర్ట్ సహా నగరంలోని రద్దీ ప్రాంతాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. గతేడాది ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన విషయం తెలిసిందే.
News February 21, 2026
క్రిస్ క్యాపిటల్ చేతికి నోవార్టిస్

స్విస్ హెల్త్కేర్ దిగ్గజం ‘నోవార్టిస్ ఏజీ’ భారత్లో వ్యాపారానికి ఫుల్స్టాప్ పెట్టనుంది. నోవార్టిస్ ఇండియా లిమిటెడ్లో ఉన్న 70.68% వాటాను క్రిస్ క్యాపిటల్కు విక్రయించనుంది. దీని విలువ రూ.1,446 కోట్లు కాగా ఈ ఏడాది చివరి నాటికి డీల్ పూర్తి కానుంది. దీంతో నోవార్టిస్లోని 26% వాటా కొనుగోలుకు క్రిస్ క్యాపిటల్ ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. అందుకు షేరుకు రూ.860.64 చొప్పున రూ.552 కోట్లు వెచ్చిస్తోంది.


